రాజ్యాధినేతలు,రాజకీయ అగ్రనేతలపైనా గ్రహణ ప్రభావం స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం చాలా అరుదైనదని, అంతేకాకుండా అత్యంత అద్భుతమనదని ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య సిద్దాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలియజేశారు. సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అగ్ర రాజ్యాధినేతలు, రాజకీయాలలో అత్యంత ఉన్నతమైన స్థానాలలో వుండే వారిపై కూడా ఉంటుందన్నారు. అలాగే వాతావరణం, భూకంపాలు, రాజకీయ అస్థిరతలు మొదలైనవి వుండునని గార్గేయ తెలియజేసారు. గ్రహణ ప్రభావం సాధారణ ప్రజలపైగాని, ద్వాదశరాశుల వారిపై వ్యతిరేక ప్రభావం …
Read More »admin
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విఆర్ఓ పృధ్వీ
కశింకోట,ఐఏషియ న్యూస్: మండలంలోని నర్సింగపల్లి వీఆర్వో 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు ఏసిబి డిఎస్పి బి. వి.యస్. నాగేశ్వరరావు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.నరసింగపల్లి గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న సూర్య కృష్ణ పృద్వి, నరసింగపల్లి గ్రామానికి చెందిన వి నాగేశ్వరరావు అనే రైతు కు చెందిన రెండు ఎకరాల 10 సెంట్లు భూమికి ముటేషన్ దరఖాస్తు సిఫార్సు చేసి,ప్రాసెస్ చేయడానికి 20 వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో నర్సింగపల్లి సచివాలయంలో గురువారం ఆ …
Read More »కనకదుర్గమ్మకు హుండీల ద్వారా 4 కోట్ల 50 లక్షలు ఆదాయం
విజయవాడ,ఐఏషియ న్యూస్: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హుండీని. గురువారంఆలయం అధికారులు లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపుల్లో మొత్తం రూ.4.50 కోట్లకుపైగా కానుకలు, ఇతర ఆభరణాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గత 31 రోజుల్లో వచ్చిన హుండీ ఆదాయాన్ని తాజాగా అధికారులు లెక్కించారు. ఇక డబ్బుతోపాటు, బంగారు నగలు, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ..హుండీలో లభించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.ఇక విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి ఆలయ ఈవో …
Read More »ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలు ఏపీ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ఏపీ చీఫ్ బ్యూరో ఐఏషియ న్యూస్: అమరావతిలో గురువారంసమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ – పీఎంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు …
Read More »ఉద్యోగి కుటుంబానికి చేయూత: లక్ష ఆర్థిక సహాయం అందజేత
సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వం మంగళగిరి,ఐఏషియ న్యూస్: ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, సహాయం చేసే గుణం ఉండటమే అన్నింటికీ మించిన ఆస్తి అన్న చందాన సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సమాచార శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చనిపోగా, సదరు ఉద్యోగి కుటుంబ దిన స్థితిని గమనించిన సమాచార కమిషనర్ స్పందించి, తన నెల వారి జీతం నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయంగా అందజేశారు. వివరాల్లోకి వెళితే.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పుల్టేటికూరు గ్రామానికి చెందిన …
Read More »గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
నిమజ్జనానికి 50 వేల విగ్రహాలు రానున్నట్లు అధికారులు అంచనా హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు.303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభాయాత్రలు. నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ. 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు.30 వేల మందితో పోలీసు బందోబస్తు.160 యాక్షన్ టీంలు.నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు. 72 కృత్రిమ కొలనులు..134 క్రేన్లు,259 మొబైల్ క్రేన్లు. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు సిద్ధం.. 200 మంది గజ ఈతగాళ్లు. శానిటేషన్ కోసం 14,486 మంది …
Read More »మోడీ తర్వాత స్థానం జూనియర్ ఎన్టీఆర్ దే
పాపులర్ వ్యక్తుల జాబితా విడుదల చేసిన ఎక్స్ సంస్థ బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లు, చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్)లో సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖుల గురించి నెటిజన్లు నిరంతరం మాట్లాడుకుంటుంటారు.తాజాగా, ఆగస్టు నెలలో ఇండియాలో అత్యధికంగా చర్చ జరిగిన సెలబ్రిటీల జాబితాను ఎక్స్ సంస్థ విడుదల చేయగా,అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ స్థానం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ జాబితాలో ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోడీ అగ్ర స్థానంలో నిలిచారు.అయితే, ఆయన తర్వాత ఎన్టీఆర్ నిలవడం …
Read More »దృష్టిలోపం గల దివ్యాంగులకు ఎంపీసీ,బైపీసీ కోర్సులు చదవడానికి ప్రభుత్వం అనుమతి
అమరావతి,ఐఏషియ న్యూస్: దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదని, వారికి మిగిలిన విద్యార్థులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ చూపారు. దృష్టి లోపం గల దివ్యాంగ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపిసి కోర్సులు చదవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ జీ ఓ 278 జారీ చేసింది. తమకు సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించాలని దృష్టిలోపం గల విద్యార్థులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కు …
Read More »భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు: టిటిడి
తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించగా, అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడినని …
Read More »విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భోజనం చేయాలి
ఫుడ్ పాయిజన్ జరిగే సంఘటనలు తగ్గుతాయి తెలంగాణ హైకోర్టు సీజే అపరేశ్కుమార్ సింగ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగాప్రభుత్వపాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఇలా చేస్తే ఫుడ్ పాయిజన్ ఘటనలు తగ్గిపోతాయి, నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని అభిప్రాయపడింది.స్కూల్ భోజన నాణ్యతపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వాములు కావడం తప్పుకాదని సీజే వ్యాఖ్య.తాను కూడా చిన్నప్పుడు స్కూల్ పనులు చేశానని సీజే అపరేశ్కుమార్ సింగ్ గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వంపై పిటిషనర్ వాదన ఈ …
Read More »
News Website (iasianews.net) I Asia News