అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు,రేషన్ పంపిణీలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది.క్యూఆర్ కోడ్తో కూడిన ఈ రేషన్ కార్డులను ఉచితంగా గత కొద్ది నెలల నుంచి పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది ఈ కార్డులను ఇంకాతీసుకోలేదు. ఆగస్టు నుంచి కార్డులను ఏపీ ప్రభుత్వం ఇస్తుండగా ఇప్పటికీ చాలామంది తీసుకోలేదు. కేవలం వృద్దులు, వికలాంగులకు మాత్రమే రేషన్ డీలర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి ఇస్తున్నారు.ఇప్పటికీ …
Read More »Politics
ప్రభుత్వ వైద్య కళాశాలలుప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలి
అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు నిర్వహిస్తోంది. కోటి సంతకాల సేకరణతో ఈ నెల 18న మాజీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం సరైనదిగా వాదిస్తోంది. కాగా, ఈ సమయంలో వైసీపీ మెడికల్ కాలేజీల అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ తమ ఆందోళన వివరించే ప్రయత్నం చేస్తోంది.ఏపీలో …
Read More »తెలంగాణలో “మహిళల ఉచిత బస్సు” ప్రయాణానికి రెండేళ్లు పూర్తి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమై నేటికి (డిసెంబర్ 9) సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం మహిళా సాధికారతకు గొప్ప మార్గంగా నిలిచింది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అనుహ్య స్పందనను దక్కించుకుంది. తొలి రోజుల్లో …
Read More »కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్: ఒక్కో సంఘానికి 15 వేలు
అమరావతి,ఐఏషియ న్యూస్: నూతనంగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను ప్రకటించింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నారు.ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది.సంఘం నిధి పెంచేందుకు,సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకునేందుకు, బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరయ్యేందుకు రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుంది. త్వరలో సంఘాల ఖాతాల్లో నిర్దేశిత …
Read More »జమిలి ఎన్నికల బిల్లుకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం లేదు
జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తెలిపిన లా కమిషన్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు’ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్,సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలిపింది.ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది. సమాఖ్య నిర్మాణానికి భంగకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్నీ మార్చడం లేదని స్పష్టం చేసింది. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ.. గురువారం లా కమిషన్తో కూడా …
Read More »డల్లాస్ లో పర్యటించిన నారా లోకేష్
తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం అండ డల్లాస్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలోని డల్లాస్లో తెలుగు ఎన్.ఆర్.ఐలనుద్దేశించి ప్రసంగించారు. కర్టిస్ కల్వెల్ సెంటర్లో వేలాది మంది తెలుగు ప్రవాసుల సమక్షంలో లోకేష్ మాట్లాడుతూ, కష్టకాలంలో తమకు అండగా నిలబడిన తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రవాస భారతీయులను (ఎన్.ఆర్.ఐలను) ప్రశంసిస్తూ వారిని “మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్” గా అభివర్ణించారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా …
Read More »ఆ 37 మంది మినహా అంతా ఓకే
ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.వన్ టూ వన్ భేటీల తర్వాత ఎమ్మెల్యే పనితీరు మెరుగైందని చంద్రబాబు అన్నారు.37 మంది శాసనసభ్యులు మినహా మిగతా అందరి పనితీరు మెరుగుపడిందని..ఓ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపైనా సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నా నన్న చంద్రబాబు.పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో …
Read More »తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీకొడతా
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా. ఎవరితోనైనా కొట్లాడుతా.. ఢిల్లీనైనా ఢీ కొడుతా నిధులు తీసుకొస్తా. అడగడానికి కూడా వెనుకాడను. రాకపోతే కొట్లాడటానికి అసలే భయపడను. రాష్ట్రానికి కావలసిన నిధులు, రావలసిన అనుమతుల కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఒకటికి వందసార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది. వయసుంది. విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకుంది.మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాకతీయ కాలం నుంచి …
Read More »తెలంగాణ “రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025′ చంద్రబాబుకు ఆహ్వానం
ఆహ్వాన పత్రిక అందజేసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమరావతి,ఐఏషియ న్యూస్: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తున్న’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు రావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోమటిరెడ్డి కోరారు.ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ …
Read More »పరిపాలన వికేంద్రీకరణ తోనే ప్రజలకు సత్వర న్యాయం
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభం వర్చువల్ విధానంలో 77 కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధులతో సాగునీటి కాలువలకు సిమెంట్ లైనింగ్ చేపట్టాలని స్పీకర్ సూచన నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారంనర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘డివిజనల్ అభివృద్ధి అధికారి’ (డిడిఓ)కార్యాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి,శిలాఫలకాన్ని …
Read More »
News Website (iasianews.net) I Asia News