Politics

సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ చేసిన ఘనత ఎన్డిఏ ప్రభుత్వానిది

ఏలూరు,ఐఏషియ న్యూస్: సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు. సోమవారం నెలలవారీ పెన్షన్ల పంపిణీ కోసం ఏలూరు జిల్లాకు వెళ్లిన అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ పెన్షన్ల కోసం మన రాష్ట్రం కంటే ఎవరూ ఎక్కువ ఖర్చుపెట్టడం లేదన్నారు. ఏడాదికి 33వేల కోట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వారిలో 59శాతం …

Read More »

ఢిల్లీ చేరుకున్న విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, అనితలకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, అప్పల నాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, లావు కృష్ణదేవరాయలు, పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుమల్ల ప్రసాద్ రావు, టిడిపి సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్.మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలవనున్న మంత్రులు లోకేష్, అనిత.మొంథా …

Read More »

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వచ్చే జనవరిలోగా పూర్తి చేస్తాం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏకకాలంలో అనేక రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 75శాతం పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి నేడు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను కేంద్ర …

Read More »

ఆంధ్రప్రదేశ్ “సమగ్రాభివృద్ధి మూడు జోన్లు” ఏర్పాటు

మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం మీడియాతో తన మనసులో మాట వెల్లడించిన సీఎం చంద్రబాబు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంసమగ్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శనివారం మీడియాతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని …

Read More »

ఏపీలో 40 కొత్త పంచాయతీల ఏర్పాటుకు లైన్ క్లియర్

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో మరోసారి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం కొత్త పంచాయతీలు ఏర్పడగా,ఇప్పుడు తాజాగా మరికొన్ని కొత్త పంచాయలతీలు రానున్నాయి. గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్నప్పుడు, 2020లో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశారు. అప్పుడు మొత్తం 50 పంచాయతీలు ఏర్పడ్డాయి. అందులో అనకాపల్లి జిల్లాలోనే 49 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఒకటి రెండు తప్ప మిగతా అన్నిటికీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ …

Read More »

ఆర్థిక కేంద్రంగా “అమరావతి” ఆవిర్భావం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కితాబు 15 జాతీయ బ్యాంకులు బీమా సంస్థల కేంద్ర కార్యాలయాలకు శంకుస్థాపన (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల …

Read More »

రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం

వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటి పంటలకు అవార్డులు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక రైళ్లు వైసిపి అధినేత జగన్ ఆగ్రహం పులివెందుల,ఐఏషియ న్యూస్: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లింగాల మండలం అంబకపల్లి గ్రామాల్లో సాగుతున్న అరటి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనను పక్కన వదిలి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇన్పుట్ సబ్సిడీని గాలికి వదిలేశారన్నారు. ఉల్లి రైతులకు కూడా …

Read More »

2 కోట్ల ఆధార్ నంబర్లను డిఆక్టివేట్ చేసిన యూఐడీఏఐ

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూఐడీఏఐ తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సైబర్ నేరాలువిపరీతంగాపెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఈ …

Read More »

రాజ్యంగం ద్వారానే అమరావతి సాధించాం: మహిళా కమిషన్ ఛైర్మెన్ రాయపాటి శైలజ

అమరావతి,ఐఏషియ న్యూస్: భారత రాజ్యంగం ద్వారానే అమరావతి రాజధాని సాధించామని ఏపీ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.ఫోరమ్ ఫర్ ఆర్టిఐ ఆధ్వర్యంలో బుధవారం అమరావతి లోని మందడం రైతు జెఏసి శిభిరంలో గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ అధ్యక్షతన రాజ్యాంగ ఆమోద దినోత్సవ రాష్ట్ర సదస్సు ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ఛైర్మెన్ శైలజ మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు వరం అని, కొంత మంది బ్లాక్ మెయిల్ …

Read More »

మూడు కొత్త జిల్లాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో 26 నుంచి 29కి పెరగనున్న జిల్లాల సంఖ్య త్వరలో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు,నూతనంగా ఒక మండలం ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరుమార్పు జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ సిఫార్సుకు సీఎం చంద్రబాబు ఆమోదం కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు- అనంతరం నోటిఫికేషన్ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు …

Read More »