Recent Posts

ముంబయి రైలు బాంబు పేలుళ్లు కేసులో 12 మందికి విముక్తి

బాంబే హైకోర్ట్‌ తీర్పు: ప్రాథమిక సాక్షాల లోపం ముంబై,ఐఏషియన్ న్యూస్: బాంబే హైకోర్ట్‌ 2006 ముంబయి రైలు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు, మరణ శిక్షలు పొందిన 12 మందిని సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు రద్దు చేసింది. ఐదుగురికి మోకా కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడానికి నిరాకరించగా, ఏడుగురికి విధించిన జీవిత ఖైదును కూడా కొట్టివేసింది.ప్రాసిక్యూషన్‌ ప్రాథమిక ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని, నిందితులను చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని ఒప్పించేందుకు బలవంతం చేశారన్న వాదనను హైకోర్టు అంగీకరించింది. …

Read More »

రోడ్డు ప్రమాదం మృతుని కుటుంబానికి 1 లక్ష 58 వేల నగదు అందచేత

పీఎంపాలెం ఎస్ఐ భాస్కరరావును అభినందించిన ఏసిపి, సీఐలు మధురవాడ(విశాఖపట్నం),ఐఏషియన్ న్యూస్: పి.ఎం.పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. దీంతో మానవతా దృక్పథంతో పి.ఎం.పాలెం పోలీసుస్టేషన్ ఎస్.ఐ.భాస్కరరావు జరిగిన విషయాన్ని తన వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టారు. స్టేటస్ చూసిన ప్రతీ ఒక్కరూ స్పందించి ఎవరికి తోచిన వారు తమవంతుగా నగదు పంపించారు. సోమవారం సాయంత్రానికి 1 లక్ష 58 వేల రూపాయలు సమకూరింది.ఈ మొత్తాన్ని మృతుని కుటుంబసభ్యులకు ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలకృష్ణ …

Read More »

భారత ఉప రాష్ట్రపతి ధన్ ఖఢ్ రాజీనామా

న్యూ ఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: దేశ రాజకీయాల్లో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.కాగా, 2022 ఆగష్టు …

Read More »