admin

పోరాడేవారంటే పాలకులకు భయం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలకవర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీనటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ 18 వ మహసభ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎయు ఎగ్జిబిషన్ మైదానంలో “శ్రామిక ఉత్సవ్” నాలుగో రోజు మంగళవారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావముందన్నారు. పెరియార్, అణ్ణా, అంబేద్కర్, …

Read More »

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల

అమరావతి,ఐఏషియ న్యూస్: 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగిన జిల్లాలు. రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు బుధవారం నుంచి అమలు.మార్కాపురం, పోలవరం జిల్లాలుఏర్పాటుచేస్తూతుదినోటిఫికేషన్‌.రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి మార్పు చేశారుసామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్పు చేయడం జరిగింది.పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా …

Read More »

ద్రాక్షారామంలో అపచారం: శివలింగం ధ్వంసం చేసిన దుండగులు

ద్రాక్షారామం,ఐఏషియ న్యూస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయం సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు,భక్తులుతీవ్రదిగ్భ్రాంతిచెందారు.శివలింగంపై సుత్తి వంటి మొనదేలిన ఆయుధంతో కొట్టి విరగ్గొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా పరిశీలించారు. క్లూస్ …

Read More »

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి నేడే చివరి రోజు

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: మీరు ఇంకమ్ ట్యాక్స్ ఎక్కువగా చెల్లించారా? రీఫండ్ అందుకోవాలనుకుంటున్నారా?అయితే ఈ సమాచారాన్ని తప్పకుండా చదవండి. చివరి అవకాశం నేటితో ముగింపు 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఐటీఆర్ ఇంకా ఫైల్ చేయకపోతే, ఈనెల 31 లోపు తప్పనిసరిగా ఫైల్ చేయాలి. లేదంటే మీకు రీఫండ్ రావడం లేదు. 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం లేదు. లేటుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కలిగే నష్టాలు ఐటిఆర్ లేటుగా ఫైల్ చేస్తే రీఫండ్ దక్కదు. మీకు వచ్చే …

Read More »

ప్రియాంకగాంధీ కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం

రాజస్థాన్ ,ఐఏషియ న్యూస్: కాంగ్రెస్‌ అగ్రనేత,లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్‌ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్‌ వాద్రా(25)కు అతని గర్ల్‌ఫ్రెండ్‌ అవీవా బేగ్‌(23)తో నిశ్చితార్థం జరిగిందని గాంధీ కుటుంబసన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రణ్‌థంబోర్‌లో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో ఈ వేడుక జరిగినట్టు వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం రేహాన్‌, అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో రేహాన్‌ ఇటీవల చేసిన పెళ్లి ప్రతిపాదనకు అవీవా అంగీకారం …

Read More »

ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివి..

మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ప్రేమవివాహాల్లో ఒడిదుడుకులు సహజమన్న హైకోర్టు ధర్మాసనం తమను కాదని వెళ్లిన కూతురి కోసం కోర్టుకెక్కిన వృద్ధ తల్లిదండ్రులు యువతి మేజర్ అయినందున ఆమె నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని సూచన చెన్నై,ఐఏషియ న్యూస్: ప్రేమ వివాహాలపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివని,వాటిలో లాభనష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.తిరుచ్చికి చెందిన ఓ నర్సు అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ …

Read More »

ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదు

కొత్తవలస సిఐ షణ్ముఖరావు హెచ్చరిక కొత్తవలస,ఐఏషియ న్యూస్: నూతన సంవత్సర వేడుకలను ఈనెల 31వ తేదీన కొత్తవలస మండలంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కొత్తవలస సిఐ సి.హెచ్. షణ్ముఖరావు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకొనేందుకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలకు కొన్ని సూచనలు చేసారని సిఐ మీడియాకు వివరించారు. 31రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మండల …

Read More »

చిన్నారి కీర్తికి కనకం కుటుంబం 20వేల రూపాయల ఆర్థిక సహాయం

పెద్దపెల్లి,ఐఏషియ న్యూస్: కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు అంబేద్కరిస్టు సామాజిక కార్యకర్త కీర్తిశేషులు కనకం విజయ్ పెద్దపెల్లి జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందినవారు. గత రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ సభ్యుల నుండి సేకరించిన 20వేల రూపాయలను కనకం విజయ్ కూతురు బేబీ కనకం కీర్తికిఅందజేసినారు. కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకం రమణ ఉపాధ్యక్షులు కనకం సమ్మయ్య చేతుల మీదుగా …

Read More »

విజయవాడ కనకదుర్గ గుడి విద్యుత్ సరఫరా నిలిపివేత

విజయవాడ,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం విజయవాడ కనకదుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. జనరేటర్ సాయంతో ఆలయంలో విద్యుత్ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపింది. భక్తుల మనోభావాలను …

Read More »

వైకుంఠ ద్వార దర్శనానికి 7,70,000 టోకెన్ల జారీ

నిర్ణీత సమయానికి లైన్లో చేరుకుంటే రెండు గంటల్లోనే దర్శనం టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠద్వార దర్శనాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం కావటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో, ఈ సమయంలో దర్శనంకు వచ్చే భక్తులకు …

Read More »