admin

హెచ్‌1బీ వీసా పొందాలంటే అక్టోబరు దాకా ఎదురుచూపులు తప్పవా?

ఆందోళన చెందుతున్న భారతీయ దరఖాస్తుదారుడు వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా ఖాతాల పరిశీలన పాలసీ వల్ల భారత హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తు చేసిన వారు ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురయింది. పలువురు దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకూ వాయిదా పడినట్లు ఆంగ్ల మీడియా కథనాలు ద్వారా భారతీయులు తెలుసుకుని తీవ్ర అసౌకర్యం కలిగిందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం …

Read More »

హాస్టళ్లలో విద్యార్థులకు ఏం జరిగినా అధికారులను సస్పెండ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్,ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు.అలాగే హాస్టళ్లలో విద్యార్థులకు ఏదైనా జరిగితే అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని, కలెక్టర్లు సంక్షేమ హాస్టళ్లలో రాత్రి బస చేయాలని చెప్పారు. విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని, ఒత్తిడి తగ్గించడానికి యోగా,ధ్యానం,క్రీడలు తప్పనిసరి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

విజయవాడ రద్దీ తగ్గించేందుకు గొల్లపూడి సాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి విజయవాడ ఎంపీ కేసినేని న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ స్టేషన్ పై రైళ్ల రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ఆలోపు మరికొన్ని కొత్త ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమరావతి రైల్వే జంక్షన్ ప్రతిపాదన కూడా వచ్చింది. దీంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో విజయవాడ రైల్వే జంక్షన్ పై …

Read More »

మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆగేవరకు పోరాటం ఆగదు

గవర్నర్ ను కలిసి కోటి సంతకాల ప్రతులను అందజేసిన మాజీ సీఎం జగన్ విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ప్రయివేటు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయం పైన నిరసనలు నిర్వహించింది. కోటీ సంతకాలు సేకరించింది. వీటిని మాజీ సీఎం జగన్ గవర్నర్ కు గురువారం అందజేయడం జరిగింది. కాగా.. ఈ సందర్భంలో జగన్ కీలక హెచ్చరికలు చేసారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆగే …

Read More »

పసుపు కిలో రూ:200 గిట్టుబాటు ధర కల్పించాలి

పసుపు రైతులకు ఉచితంగా ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ చేయాలి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర, మండల కార్యదర్శి టి క్రిష్ణరావు జీకే మండ పంచాయతీ గడ్డిమర్రి గ్రామంలో ఆదివాసులు పండిస్తున్న పసుపు పంటలను గురువారం పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసి ప్రాంతంలో పండిస్తున్న ఏజెన్సీ బంగారం పసుపు కిలో రూ :200 కొనుగోలు చేస్తే తప్పా రైతులకు గిట్టుబాటురాదన్నారు.ప్రభుత్వం …

Read More »

నేడు,రేపు టెన్త్ ఫీజు చెల్లింపునకు అవకాశం

అమరావతి,ఐఏషియ న్యూస్: పదవ తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపునకు శుక్ర, శనివారం వరకు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి లాగిన్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. తక్కువ వయసున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చెల్లించవచ్చన్నారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు కూడా అదే వెబ్ సైట్ నుంచి ఫీజులు కట్టొచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు చివరి రోజు వరకు వేచిచూడ కుండా వీలైనంత త్వరగా …

Read More »

ఆకవలలలో ఒకరు ఎస్పీ మరొకరు ఏసిపి: పోలీస్ శాఖలో ఒక అద్భుతం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: కవలలు ఇద్దరూ సైంటిస్ట్ లు కావడం,ఇద్దరూ డాక్టర్లు కావడం లాంటి అద్భుతాలు ఎక్కువగా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. కవలలు ఇద్దరూ ఐపీఎస్ అధికారులు అయిన అద్భుతం ఇది. అరవిందన్ అనే ఐపీఎస్ అధికారి తన కవల సోదరుడు అభినందన్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూ వైరల్ గా మారింది. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. ఇద్దరూ ఖాఖీ డ్రెస్సులో అదిరిపోయేలా ఫోజు ఇచ్చారు. …

Read More »

ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ప్రకటించిన స్పీకర్ ప్రసాద్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ అసెంబ్లీలో గతంలో కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్,ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల విషయంలో ఎట్టకేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు,ఆయా పార్టీల ప్రతినిధులతో విచారణ నిర్వహించిన స్పీకర్ ఇవాళ తన నిర్ణయం ప్రకటించారు. ఓవైపు సుప్రీంకోర్టు వరుస డెడ్ లైన్లతో ఉరుముతున్న వేళ స్పీకర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తెల్లం వెంకట్రావు,బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, …

Read More »

అరటిపువ్వు కూర తింటే..అసిడిటీ,హైబీపీకి చెక్ పెట్టొచ్చు

హెల్త్ డెస్క్ ,ఐఏషియ న్యూస్: అరటి పండులో పోషకాలెన్నో వున్నాయి.అరటి పండు కంటే అరటి పువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. అరటిపువ్వు వంటకాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఒక పాత్ర‌లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పోపు గింజలు వేసి.. వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేపుకోవాలి. అందులో కట్ చేసిన అరటి పువ్వు ముక్కల్ని చేర్చుకోవాలి.అందులోనే ఉప్పు, కొద్దిగా ఇంగువ‌, క‌రివేపాకులు, ధ‌నియాల పొడి, కొత్తిమీర‌, ప‌సుపు కూడా చేర్చి.. …

Read More »

ఆఫీసులో అలసిపోతున్నారా? బొప్పాయి ముక్కలు తినండి

హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని తినాల్సిందే అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇంటికెళ్లిన వెంటనే కాఫీలు, టీ తీసుకోకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవడం చేయాలి. బొప్పాయిలో వుండే విటమిన్ సి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతేగాకుండా విటమిన్ సి.. ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది.మధుమేహం రాకుండా వుండాలంటే రోజూ ఒక కప్పు బొప్పాయి …

Read More »