admin

వేదికపై కానిస్టేబుల్ కోరిన వెంటనే రోడ్డు మంజూరు

మంగళగిరి,ఐఏషియ న్యూస్: కానిస్టేబుల్ నియామక కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ లకే బాబూరావు తన స్వగ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి అధికారులు ఆదేశించారు.ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు త్వరగా అంచనాలు సిద్ధం చేయగా రూ. 2 కోట్లతో రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ పరిపాలనా అనుమతులు కూడాఇచ్చారు.సభముగిసేలోగారోడ్డుమంజూరుఅయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు.అల్లూరి జిల్లాజికేవీధిమండలంతెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు …

Read More »

ధ్వజ స్తంభాలు,రథాలు తయారీకి 100 ఎకరాల్లో వృక్షాలు పెంచాలని టిటిడి నిర్ణయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఏర్పాటైన ఈ సమావేశానికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగాటీటీడీ ఆధీనంలోని అన్ని ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేయడానికి ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచాలని నిర్ణయించారు. ధ్వజస్తంభాలు, రథాలను తయారు …

Read More »

విద్యుత్ శాఖకు తెలంగాణ “గీతం యూనివర్సిటీ” 118 కోట్లు బకాయిలు

విద్యుత్ బిల్లు బకాయిలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం విద్యుత్ శాఖ ఎస్ ఈ కోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలోని గీతం యూనివర్సిటీ.. ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించలేదంటూ టీజీఎస్పీ డీసీఎల్ ఆ యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై ఆ వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. సదరు యూనివర్సిటీ 2008 నుంచి రూ. 118 కోట్లు బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్యులు రూ.1,000 కట్టకపోతే అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ …

Read More »

జోజినగర్ ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణ చేపట్టాలి

42 మంది బాధితులకు కొత్త ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి బాధితుల బ్యాంకు రుణాలు ప్రభుత్వమే చెల్లించాలి జోజినగర్ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో విజయవాడ భవానీపురంలో ఉన్న జోజినగర్ లో తాజాగా 42 ఇళ్ల కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ తాజాగా అక్కడ ఉన్న ఇళ్లను స్ధానిక అధికారులు కూల్చేయడం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఆయా బాధితులు విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను …

Read More »

మహిళా ఉద్యోగులకు,ఒంటరి పురుషులకు సీఎం చంద్రబాబు శుభవార్త

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈసారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన ఓ విధానం ప్రకారం మహిళా ఉద్యోగులకు ఓ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆయా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ …

Read More »

క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదు,ఇళ్ల స్థలం,గ్రూప్ వన్ ఉద్యోగం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి,ఐఏషియ న్యూస్: మహిళావరల్డ్‌ కప్‌లో సత్తా చాటిన శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం తరుఫున రూ.2.50 కోట్ల నగదు బహుమతి. కడపలో 1,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలం మంజూరు చేసింది.రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్‌-1 హోదాలో ఉద్యోగ నియామకం. ఈ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. Authored by: Vaddadi udayakumar

Read More »

ఆ..ఒక్క ఓటు ఆమెను సర్పంచ్ ని చేసింది

అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.ఒక్కఓటు తేడాతో విజయం సాధించిన కోడలు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద.అయితే నిజానికి ఆ ఓటు కూడా ఎంతో విలువైనది.డబ్బుల పరంగా కూడా.ఎన్నికలలో నిలబడిన కోడలి కోసం ఆమె మామ అమెరికా నుండి వచ్చి మరీ ఓటు వేశాడు కాబట్టి.సర్పంచ్ ఎన్నికలలోప్రతీ ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఒక్క ఓటే కదా అని నిజంగా …

Read More »

గోదావరి నదిఒడ్డున తవ్వకాలు “సింహంపై కూర్చున్న దుర్గాదేవి” విగ్రహం ప్రత్యక్షం

మంచిర్యాల,ఐఏషియ న్యూస్: మంచిర్యాల జిల్లా, ముల్కల ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున అరుదైన అమ్మవారి విగ్రహం బయటపడడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం లభ్యం కావడంతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో నిండిపోయింది. ఈ అద్భుతాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. గోదావరి నది ఒడ్డున జనసందోహం నెలకొంది. అయోధ్య పూజారి సూచనతో తవ్వకాలు.. అమ్మవారి విగ్రహం బయటపడడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇటీవల..ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యరామ మందిరం పూజారీతో పాటు పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు …

Read More »

యూపీఐ పేమెంట్లకు వీలుగా కియోస్క్ మిష‌న్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ అనుబంధ ఆలయాలను కూడా దర్శించుకుంటారు. అలాగే దేశ‌వ్యాప్తం ఉన్న 60 టీటీడీ ఆలయాలకు కూడా భక్తులు వెళుతుంటారు. వీరి కోసం సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిష‌న్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాల‌ని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారుల‌ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో సీనియ‌ర్ అధికారుల‌తో సోమవారం స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించ‌ద‌ల‌చిన ఐదువేల …

Read More »

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం

ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఎంపికైన కానిస్టేబుల్ తో సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో సరిపుచ్చిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిచేసింది. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 …

Read More »