admin

తండ్రి ఆటో కింద పడి కూతురు మృతి

అనకాపల్లి,ఐఏషియ న్యూస్: విశాఖ ఎన్ఏడి నుండి మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ టెట్ పరీక్ష రాసేందుకు తండ్రి ఆటోలో వెళుతుండగా ఆటో అదుపుతప్పి ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్ కుమార్తెసునీత (25) అక్కడికక్కడే మృతి చెందగా. తండ్రి లక్ష్మణరావు స్వల్ప గాయాలయ్యాయి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసిన అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు. Authored by: Vaddadi udayakumar

Read More »

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 15 మంది దుర్మరణం

మారేడుమిల్లి,ఐఏషియ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు అది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది.ఈ సమాచారం అందిన …

Read More »

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ వేళల మార్పు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్ని ద.మ.రైల్వే మార్చింది. కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని జోన్‌ సీపీఆర్వో ఏ.శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం-లింగంపల్లి(12806)రైలువిశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరి, లింగంపల్లికి రాత్రి 7.15కి చేరుకుంటుంది. లింగంపల్లి-విశాఖపట్నం(12805) రైలు ఉదయం 6.55కి లింగంపల్లి నుంచి బయల్దేరి, విశాఖపట్నంకు రాత్రి 7.50కి చేరుకుంటుంది.ఈ మారిన వేళలను ప్రయాణికులు గమనించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

బ్లూబర్డ్‌ ఉపగ్రహ ప్రయోగం 21కి వాయిదా

తిరుపతి,ఐఏషియ న్యూస్: ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్‌’ వాయిదా పడినట్టు తెలిసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ ప్రయోగం ద్వారా బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని తొలుత ఈనెల 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. అయితే రాకెట్‌ అనుసంధానంఆలస్యం కావడంతో ఈ ప్రయోగం ఈ నెల 21కి వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం. షార్‌లోని రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ …

Read More »

తిరుపతి,తిరుమల స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

25 నుండి 27 వరకు ఈ-డిప్ నమోదుకు అవకాశం 29వ తేదిన టోకెన్లు కేటాయింపు తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6,7,8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల,తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో ఏఐ వైద్యులు అందుబాటులోకి తీసుకువస్తాం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: సీఎం చంద్రబాబు శుక్రవారం విశాఖలో కీలక ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్ వద్ద ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాగ్నిజెంట్ ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘త్వరలోనే అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు ఏఐ డాక్టర్లను కూడా అందుబాటులోకి తెస్తామని, ఆరోగ్యపరంగా ఏం కావాలన్నా ఏఐ డాక్టర్లను అడిగి ముందుకు వెళ్లే పరిస్థితిని తీసుకొస్తామని పేర్కొన్నారు. వాళ్లే వైద్య పరీక్షలు ఆటోమేటిక్ గా చేసుకునే …

Read More »

ఏపీ ఫైబర్ నెట్ కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. గత వైసీపీ ప్రభుత్వం సమయంలో ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.కాగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో …

Read More »

ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్ర క్యాబినెట్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకం “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా కొనసాగనుంది.సంవత్సరానికి 120 పని దినాలను తప్పనిసరి చేసింది. అంతేకాదు ఈ పథకం అమలుకు రూ.1.51 లక్షల కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉపాధి హామీ కూలీలకు మేలు జరగనుంది. ఎక్కువ కూలీ దొరికే అవకాశం ఉంది. Authored by: Vaddadi udayakumar

Read More »

ఉప్పల్‌లో ఫుట్‌బాల్‌ సంబరం..మెస్సీ–సీఎం రేవంత్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్

హైదరాబాద్‌,ఐఏషియ న్యూస్: నగరంలోని ఉప్పల్‌ స్టేడియం శనివారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఉత్సవానికి వేదికగా మారనుంది. రాత్రి 7 గంటలకు ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ జట్టు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్టు మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. భారత్‌ పర్యటనలో భాగంగా మెస్సీ హైదరాబాద్‌కు రావడం ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేసిన మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంతో స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక సందడి నెలకొంది.ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్‌ …

Read More »

ఇండిగో సంక్షోభం.. దిల్లీలో రూ.1,000 కోట్లు నష్టం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండిగో సంక్షోభంతో దిల్లీలో వ్యాపార,పర్యాటక, పారిశ్రామిక రంగాలకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లిందని ది ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ రాకపోకలకకు అంతరాయం కలిగిందని పేర్కొంది. గత 10 రోజుల్లో దిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25శాతం తగ్గిందని వివరించింది. దిల్లీ విమానాశ్రయం నుంచి నిత్యం 1.5 లక్షల ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారని అందులో సుమారు 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్‌ ట్రావెలర్స్‌ ఉంటారని తెలిపింది. Authored …

Read More »