విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలంను విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, 64 వ వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు చోడిపిల్లి ముసలయ్య , అధికారులతో కలిసి బయటకు తీయడం జరిగింది ఈ తిమింగలము చనిపోయి ఒడ్డుకు కొట్టుకొని రావడం వలన బయటకు తీసి ఆ తిమింగల మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు.
తిమింగలం సుమారుగా 3టన్నులు బరువు,15 అడుగుల పొడవు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇలా సముద్రపు అలల దాటికి భారీ తిమింగలం కొట్టుకు రావడం ఇదే మొదటిసారి. ఈ తిమింగలాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ భారీ తిమింగలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించుకున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News