బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: మీరు ఇంకమ్ ట్యాక్స్ ఎక్కువగా చెల్లించారా? రీఫండ్ అందుకోవాలనుకుంటున్నారా?అయితే ఈ సమాచారాన్ని తప్పకుండా చదవండి.
చివరి అవకాశం నేటితో ముగింపు
2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఐటీఆర్ ఇంకా ఫైల్ చేయకపోతే, ఈనెల 31 లోపు తప్పనిసరిగా ఫైల్ చేయాలి. లేదంటే మీకు రీఫండ్ రావడం లేదు. 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం లేదు.
లేటుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కలిగే నష్టాలు
ఐటిఆర్ లేటుగా ఫైల్ చేస్తే రీఫండ్ దక్కదు. మీకు వచ్చే అదనపు పన్ను తిరిగి రాదు.ఐటీఆర్ లేటుగా ఫైల్ చేస్తే రూ. 5,000 వరకు ఫైన్ పడుతుంది (పన్ను రూ.5 లక్షల లోపు అయితే రూ.1,000).చెల్లించాల్సిన పన్నుపై అదనంగా వడ్డీ (తీరు) లేదు.మార్కెట్ లేదా ఇతర నష్టాలను భవిష్యత్తులో లాభాలతో కలిపే అవకాశముండదు.
వెంటనే మీరు చేయవలసింది
ఇంకమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్లండి.. మీ వివరాలు, ఫారం 26 ఏ ఎస్, ఏఐఎస్ చెక్ చేయండి.ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోండి.చివరి నిమిషానికి వాయిదా వేయకుండా తక్షణమే ఐటీఆర్ సమర్పించండి.
గుర్తుంచుకోవలసిన విషయాలు
31 తర్వాత ఐటీఆర్, రీఫండ్ పొందే అవకాశం లేదు. ఆలస్యం చేస్తే ఆర్థిక నష్టం,నోటీసులు వచ్చే అవకాశం. అందుచేత 31లోపు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేసి, మీ రీఫండ్ డబ్బు సురక్షితంగా పొందవచ్చు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News