Business

సింగరేణి మరో కీలక ఖనిజ రంగంలో ముందడుగు

సింగరేణి,ఐఏషియ న్యూస్: సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేసింది.ఎన్.ఎఫ్.టి.డి.సి సంస్థ సాంకేతిక సహకారంతో ప్రయోగాత్మకంగా ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు.సింగరేణి ఓవర్ బర్డెన్, ఫ్లై యాష్, మట్టి, నిరుపయోగ మెటీరియల్ నుండిరేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన కీలక ఖనిజాల) గుర్తింపు.త్వరలోనే పైలట్ ప్లాంటు నిర్మాణం చేయనున్నట్లు సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో …

Read More »

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన

దుబాయ్,ఐఏషియ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రెండో రోజు అబుదాబిలో పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి నిర్వహించిన వన్-టూ-వన్ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకమైనవిగా మారాయి. ప్రధానంగా ఎనర్జీ రంగంపై ఫోకస్ విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ రంగంలో పెట్టుబడుల కోసం అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఛైర్మన్ ఖలీఫా ఖౌరీ, మస్దార్ సీఈఓ మొహమ్మద్ …

Read More »

లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి

షరాఫ్ గ్రూప్ సంస్థకు సీఎం చంద్రబాబు ఆహ్వానం దుబాయ్,ఐఏషియ న్యూస్: షరాఫ్‌ గ్రూప్ వైస్ ఛైర్మన్,షరాఫ్ డీజీ సంస్థ వ్యస్థాపకుడు షరాఫుద్దీన్ షరాఫ్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం భేటీ అయ్యారు.రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై షరాఫ్‌తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మౌలిక వసతులు, మావన వనరుల లభ్యత, అలాగే ఇతర అనుకూలతల గురించివివరించారు.బుధవారం యూఏఈలో తొలిరోజు పర్యటనలో భాగంగా షరాఫ్ గ్రూప్,వైస్,చైర్మన్‌,సీఎంచంద్రబాబుసమావేశమయ్యారు.ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చించారు. షరాఫ్ గ్రూప్‌ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్స్‌ పార్కులను అభివృద్ధి …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వ‌ర్క్ఆసుప‌త్రుల‌కు 250 కోట్లు బకాయిలు విడుద‌ల

విజయవాడ,ఐఏషియ న్యూస్: డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ‌(నెట్వ‌ర్క్‌) ఆసుప‌త్రుల బ‌కాయిల్లో రూ.250 కోట్లను ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. నిధుల చెల్లింపుల‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో చ‌ర్చించారు. అనంత‌రం చ‌ర్య‌ల్లో భాగంగా నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. అలాగే త్వ‌ర‌లో మ‌రో రూ.250 కోట్ల‌ను చెల్లించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ తెలిపారు.రోగుల‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైద్య‌ సేవ‌ల్ని కొన‌సాగించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ …

Read More »

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

పెట్టుబడుల సాధనకు ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన పారిశ్రామిక వేత్తలతో రోడ్ షో,తెలుగు డయాస్పొరా సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనన్న ముఖ్యమంత్రి యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ 3 రోజుల్లో 25 సమావేశాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం.. ఇప్పుడు యూఏఈకి …

Read More »

పంట నీటమునిగి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్:  ఇటీవల వర్షాల కారణంగా పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 5,250 ఎకరాలు పంటలు నీటమునిగి నష్టపోయినందున రైతులకు నష్ట పరిహారం అందించాలని, టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రెండు సంవత్సరాలకు గాను రూ.40 వేలు చెల్లించాలని,నియోజకవర్గంలో పలు సమస్యలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి, నాయకులు,రైతులతో కలసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ …

Read More »

ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం..ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు గ్రామీణ బ్యాంకులు విలీనం చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు పాటు గ్రామీణ బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు గ్రామీణ బ్యాంక్ యాజమాన్యం గురువారం ఒక పర్యటన జారీ చేశారు.ఒకే గొడుగు కిందకు ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు తీసుకురానున్నారు. విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ నెల 9న‌ సాయంత్రం 6 నుంచి 13 ఉదయం 10 వరకు లావాదేవీలు నిలిచిపోతాయి.ఏటీఎం, …

Read More »

ఇకపై ఆధార్‌ ఉంటేనే ట్రైన్ టికెట్‌

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  రైల్వే టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈనెల1 నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే, ఆ ఖాతాకు ఉన్న మొబైల్‌ నంబరు ఆధార్‌తో లింక్‌ అయి ఉండాలి. లింక్‌ చేసిన ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్‌ టికెట్లు పొందగలరు, లింక్‌ కానివారు 8.15 గంటల తరువాత మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలి. Authored …

Read More »

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం

మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టాం ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ అమరావతి,ఐఏషియ న్యూస్:  గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత పెట్టారు. గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారు. మీ రుణం తీర్చుకోవడమే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతిహామీ నిలుపుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని …

Read More »

డ్వాక్రా మహిళలకు “మన డబ్బులు- మన లెక్కలు” ఏఐ యాప్ ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి రానున్న యాప్ ఈ యాప్ వినియోగంపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం ఈ యాప్ వినియోగం వల్ల మహిళలకు బ్యాంకర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో పనిలేదు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ఉండేందుకు సరికొత్త ఆలోచన చేసింది. “మన డబ్బులు-మన లెక్కలు” అనే ఏఐ ఆధారిత యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ఇప్పటికే 260 చోట్ల పైలట్ …

Read More »