చింతపల్లి,ఐఏషియ న్యూస్: వాహనాల తనిఖీలలో భాగంగా పోలీస్ సిబ్బంది యాష్ ఆయిల్ తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఖచ్చితమైన సమాచార మేరకు వాహనాల తనిఖీలలో భాగంగా మూడు కేజీల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోగా, ఈ కుట్రలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.
అదుపులో తీసుకున్న వ్యక్తుల వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.అదుపులోకి తీసుకున్న వాళ్లపైకేసునమోదుచేసుకొనిదర్యాప్తుకొనసాగించబడుతున్నట్లు ఆయన తెలిపారు.అనుమానిత వ్యక్తులు సమీపంలో గుర్తించిన్నట్లయితే సమాచారం అందించాలని ఆయన తెలిపారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News