Business

తాజ్ మహల్ సందర్శించిన జూనియర్ ట్రంప్

తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా..అందంగా: జూనియర్ ట్రంప్ కితాబు ఆగ్రా,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త ట్రంప్ జూనియర్ ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ కట్టడాన్ని, వాస్తు శిల్పిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా.. అందంగా ఉందని కితాబు ఇచ్చారు. ట్రంప్ జూనియర్ రాక నేపథ్యంలో తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు గంట పాటు తాజ్ …

Read More »

21న భారత్ లో పర్యటించనున్న ట్రంప్ కుమారుడు

ఉదయపూర్,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈనెల 21, 22 తేదీల్లో ఉదయ్ పూర్ లో జరగనున్న ఓ రాయల్ వెడ్డింగుకు హాజరు కానున్నారు. ఈ పర్యటన ద్వారా వ్యాపార సంబంధాలు, రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీలు,రాజకీయ సందేశం వంటి అంశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అతని రాకతో ఉదయ్ పూర్ లో కఠిన భద్రత ఏర్పాట్లు చేశారు.ఈ సందర్శన భారత్ కు గ్లోబల్ వ్యాపార,టూరిజం అవకాశాలు, మీడియా దృష్టిని తీసుకువచ్చిన సాఫ్ట్ పవర్ మూమెంట్ గా భావిస్తున్నారు. Authored by: Vaddadi …

Read More »

ఏపీకి 13 లక్షల కోట్లు పెట్టుబడులు: సీఎం చంద్రబాబు ప్రకటన

ముగిసిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారంతో దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీలో ఏర్పాటు చేసిన మరికొన్ని యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు.శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 12,365 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి …

Read More »

ఏపీకి భారీగా పెట్టుబడులు: 3,49,476కోట్ల ఒప్పందాలు

4,15,890 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్ర శనివారాలు రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తొలిరోజైన శుక్రవారం …

Read More »

నేడు విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు శంకుస్థాపన

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎండాడలో పనోరమ హిల్స్ వెనుక 10ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. Authored by: Vaddadi udayakumar

Read More »

గూగుల్ మ్యాప్స్ ద్వారా “ఆర్టీసీ బస్ టికెట్ల” బుకింగ్

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ విధానం మరింత సులభతరం చేసేలా మార్పులు తెస్తోంది. ఇప్పటికే ఉన్న విధానాలతో పాటుగా కొత్తగా గుగూల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తోంది. వాట్సప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. గుగూల్ మ్యాప్స్ లో అన్ని బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీని ద్వారా కావాల్సిన సర్వీసులో టికెట్ బుక్ చేసుకొనేలా వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రయాణీకులకు ప్రస్తుతం …

Read More »

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా మృతి

లండన్,ఐఏషియ న్యూస్: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశారు.హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్ 2023లో గ్రూప్ సంస్థలకు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్ మరణానంతరం బాధ్యతలు స్వీకరించారు.గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు. ఇండో- మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్స్ నిర్వహించే సంస్థను అంతర్జాతీయ దిగ్గజ …

Read More »

గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరించిన నారా భువనేశ్వరి

లండన్,ఐఏషియ న్యూస్: లండన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో,హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరించిన నారా భువనేశ్వరి. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. Authored by:  Vaddadi udayakumar

Read More »

ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు.. 2026 మార్చికల్లా అందుబాటులోకి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: మొబైల్‌లోని మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్‌ చేస్తే ఆ వ్యక్తి నంబర్‌ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ప్రస్తుతం ఆధారపడాల్సి వస్తోంది. ఇకపై ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సమయంలో మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత …

Read More »

వెండిపైనా రుణాలు…ఆర్బీఐ కీలక నిర్ణయం

దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి.రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు,ఆభరణాలు, …

Read More »