crime

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం

తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం ఇకపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన దేవాలయాలపై నిరంతర పర్యవేక్షణ కాశీబుగ్గ దేవాలయానికి అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలిరావడం వల్ల తోపులాట పలాసలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతం పరిశీలన పలాస సీహెచ్ సీలో క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్ పలాస,ఐఏషియ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలిరావడం వల్ల …

Read More »

సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించిన చిరంజీవి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏ ఐ సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిరంజీవి.అయితే మరోసారి తనపై సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు.ఈ మేరకు ఓ ఎక్స్ ఖాతాను జోడిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి.ఫిర్యాదు చేసినా ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని,వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన చిరంజీవి.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు.. 2026 మార్చికల్లా అందుబాటులోకి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: మొబైల్‌లోని మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్‌ చేస్తే ఆ వ్యక్తి నంబర్‌ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ప్రస్తుతం ఆధారపడాల్సి వస్తోంది. ఇకపై ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సమయంలో మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత …

Read More »

చికిత్స పొందుతూ గర్భిణీ స్త్రీ మృతి

గొలుగొండ,ఐఏషియ న్యూస్: గొలుగొండ మండలం ఎటిగైరంపేట గ్రామానికి చెందిన మాకిరెడ్డి లోవ (27) అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందింది. తుఫాన్‌ నేపథ్యంలో హై రిస్క్‌ గర్భిణీలను ముందస్తు జాగ్రత్త చర్యగా ఈనెల 25న నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించాలని వైధ్యఅధికారులు ఆదేశాలు జారీ చేశారు.దీననుసరించి వైద్య సిబ్బంది లోవను ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, ఆమెను విశాఖ కేజీహెచ్‌ కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం ఆమెను …

Read More »

కర్నూల్ బస్సు దగ్ధం ఘటనలో తల్లి కూతుర్లు దుర్మరణం

మస్కట్ లో విషాదఛాయలు మస్కట్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఎన్నో ఆశలు , ఎన్నో ఊహలతో బతుకుతాము ,, అన్నీ మధ్యలోనే అడియాసలు అవుతాయి , బహుశా ఆ శివయ్య ఆట అంతేనేమో.అజాత శత్రువులుగా రెండు దశాబ్ధలకు పైగా మస్కట్ లో మా అందరిమధ్య ఉండి భర్త ఆనంద్ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగము చేసుకుంటూ కొడుకు కూతురులను మంచిగా చదివించి ఇండియాలో ఇంజనీరింగ్ అయ్యాక అమ్మాయి చందనను బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగమునకు పెట్టి ఇటీవల దీపావళి సెలవులకు హైదరాబాద్ వెళ్లి కూతురును …

Read More »

కర్నూలులో ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం: 22 మందికి దుర్మరణం

కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 20మందికిపైగాప్రాణాలుకోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. మిగిలిన వారిలో 12 మంది స్వల్ప గాయాలతోబయటపడగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అనూహ్య ఘటన ఏపీ వ్యాప్తంగా …

Read More »

ఐదు సంవత్సరాల క్రితం కిడ్నాప్ కేసును చేదించిన ఫోర్త్ టౌన్ పోలీసులు

వివరాలు వెల్లడించిన ఈస్ట్ డివిజన్ ఎసిపి కె లక్ష్మణమూర్తి విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డివిజన్ ఏసీపీ కొండపల్లి లక్ష్మణమూర్తి మాట్లాడుతూ 2020 జూలై 5వ తేదీన జామి సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పల్లపు ప్రసాద్ భరత్ ను రామ్ రెడ్డి అలియాస్ ప్రతాపరెడ్డి బోయిన …

Read More »

కర్నూలు బస్సు మృతులకు 5 లక్షలు,క్షతగాత్రులకు రెండు లక్షలు నష్టపరిహారం

కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం డిజిపి హరీష్ కుమార్ గుప్త రవాణా శాఖ మంత్రితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.అందులో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఆరుగురు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు ప్రాణాలు …

Read More »

స్వర్ణముఖి నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం అగ్రహారం గ్రామానికి చెందిన 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదం జరిగిందని,ఇసుక దిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహానికి నలుగురు యువకులు కొట్టుకుపోయారని తెలిపారు. ముగ్గురు మాత్రం స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత శాఖలకు అప్రమత్తం అవ్వాలని, గల్లంతైన విద్యార్థుల కోసం …

Read More »

పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్: 19.20 లక్షల నగదు స్వాధీనం

పరవాడ,ఐఏషియ న్యూస్: పెదముషిడివాడ శివారులోని నక్కవా నిపాలెం పొలిమేరలో ఈ నెల 21న పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ తెలిపారు.ఈ సందర్భంగా పరవాడ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పేకాట వివరాలు తెలియజేశారు. నక్కవానిపాలెం గ్రామ పొలిమేరల్లో ఒక రహస్య ప్రదేశంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ఆర్.మల్లి కార్జునరావు తన సిబ్బందితో కలిసి …

Read More »