అనంత్ నాగ్,ఐఏషియ న్యూస్: బిజ్బెహారా-అనంత్ నాగ్ మధ్య శనివారం ఉదయం లోకోమోటివ్ అద్దంను డేగ ఢీకొనడంతో రైలు పైలట్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.గాయపడిన పైలట్ శ్రీ విశాల్ కు అనంత్ నాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.తనిఖీ కోసం రైలును కొద్దిసేపు నిలిపివేసి, తర్వాత రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »crime
బ్యాంకుల దగ్గర వృద్ధులారా జర జాగ్రత్త: వృద్ధుని ఏమార్చి 3 లక్షల కొట్టేసిన కేటుగాళ్లు
బాపట్ల,ఐఏషియ న్యూస్: బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన 75 ఏళ్ల వృద్దుడు చిలంకూరి కాంతయ్య ఇంకొల్లులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాను తాకట్టు పెట్టుకున్న బంగారు నగలను విడిపించుకోవాలని వచ్చాడు.అందుకు బ్యాంకులో కట్టాల్సిన 3 లక్షల 90 వేల రూపాయలు తీసుకుని బ్యాంకులోకి వెళ్లాడు.బ్యాంకు అధికారులు మరో 10 వేల రూపాయలు వడ్డీ అయిందని, మొత్తం 4 లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు. దీంతో మరో 10 వేల రూపాయలు ఇంటికి వెళ్లి తీసుకురావడానికి తన సైకిల్పై బయలుదేరేందుకు సిద్దమయ్యాడు.తన వెంట తీసుకొచ్చిన 3 …
Read More »604 బస్సులపై కేసులు…102 బస్సులు సీజ్
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది.12 బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించి, అత్యవసర నిష్క్రమణ, అగ్నిమాపక యంత్రం వంటి భద్రతా లక్షణాలను పరిశీలించారు. 4,452 బస్సులను తనిఖీ చేసి, 604పై కేసులు నమోదు చేయగా, 102 బస్సులు సీజ్ అయ్యాయి.అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి బెంగళూరు వస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. …
Read More »55 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ.107 కోట్లు రికవరీ
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: సైబర్ నేరగాళ్ల వలలో అనేకమంది చిక్కుతున్నారు. మాయమాటలతో అమాయకులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు.రోజుకో రకంగా కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తూ నగదును దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్లు,మెసేజ్ లింక్ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువవడంతో పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్లో సైబర్ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదు …
Read More »బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడి గట్టి షాక్
11.14 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ అటాచ్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరికి చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సురేశ్ రైనా, శిఖర్ ధావన్ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ …
Read More »డ్రగ్స్ కేసులో కొండారెడ్డి అక్రమ అరెస్ట్
రాష్ట్ర మాజీ మంత్రి, అనకాపల్లి వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపణ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనుకాడటం లేదని, వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధించడమే దానికి ఉదాహరణ అని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వైయస్సార్సీపీ అధ్యక్షులు కెకె రాజు, గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ …
Read More »హుస్సేన్సాగర్ లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఓ వివాహిత క్షణికావేశంలో తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్ వ్యాపారం చేస్తుండగా ఆయన భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. వీరికి బియ్యారా అనే రెండేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కీర్తిక గత ఏడాదిన్నరగా తన కుమార్తెతో కలిసి బహదూర్పురలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దే …
Read More »రాష్ట్రవ్యాప్తంగా “120 సబ్ రిజిస్ట్రార్” కార్యాలయాల పై ఏసీబీ దాడులు
పలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు స్వాధీనం ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో అవినీతి కేంద్రాలుగా మారిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం అవినీతి నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం పరిస్ధితి మారడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ విరుచుకుపడుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏకంగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరుపుతోంది. రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ …
Read More »హెల్మెట్ లేకపోతే అల్లూరి జిల్లాలో నో ఎంట్రీ
పాడేరు,ఐఏషియ న్యూస్: హెల్మెట్ లేకపోతే పోలీసులు ఫైన్ విధిస్తారని మాత్రమే మనకు తెలుసు.కానీ హెల్మెట్ లేకపోతే ఆ జిల్లాలోకి ఏకంగా ఎంట్రీయే లేదు,అదేంటి హెల్మెట్ లేకపోతే రానివ్వరా అని అంటే, కచ్చితంగా రానివ్వరు. ఎందుకంటే జిల్లాకలెక్టర్ అధికారులకు అలాంటి ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ మాత్రమే కాదు.. మందు తాగి డ్రైవింగ్ చేసే వారికి కూడా ఆ జిల్లాలోకి నో ఎంట్రీ. రహదారి ప్రమాదాల కారణంగా నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఏపీలోని ఓ జిల్లా కలెక్టర్ ఈ మేరకు …
Read More »కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట
9 మంది భక్తులు దుర్మరణం శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతులంతా మహిళా భక్తులు. కార్తిక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఘటనాస్థలిలో సహాయ చర్యలుకొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ప్రైవేటు దేవాలయం అని దేవాదాయశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కేవలం రెండు నుంచి మూడు వేల వరకు భక్తులు బట్టి ఆలయంలో …
Read More »
News Website (iasianews.net) I Asia News