గొలుగొండ,ఐఏషియ న్యూస్: గొలుగొండ మండలం ఎటిగైరంపేట గ్రామానికి చెందిన మాకిరెడ్డి లోవ (27) అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందింది. తుఫాన్ నేపథ్యంలో హై రిస్క్ గర్భిణీలను ముందస్తు జాగ్రత్త చర్యగా ఈనెల 25న నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించాలని వైధ్యఅధికారులు ఆదేశాలు జారీ చేశారు.దీననుసరించి వైద్య సిబ్బంది లోవను ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం ఆమెను విశాఖకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ ఘటనతో ఎటిగైరంపేట గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News