హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం గత ఆదివారం అన్ని పత్రికలలో కుళ్ళిన చేపల విక్రయాలు. అనే కథనానికి స్పందించిన అధికారులు, పిసాకమిటీ సభ్యులు శనివారం సంతలో చేపల అమ్మకాల సముదాయాలను పరిశీలించారు. వాటిలో కుళ్ళిన వాటిని దగ్గరుండి తొలగించారు అంతేకాకుండా ఎర్ర తార్పాన్ లు వల్ల మోసం జరుగుతుందని. ప్రధాన పత్రికలలో ప్రచురించిన అంశాన్ని గుర్తించి ఎర్ర తార్పాన్ లు పంచాయతీ సెక్రెటరీ సత్యనారాయణ మరియు మహిళా పోలీస్ జ్యోతి సచివాలయ సిబ్బంది అలాగే పీసా కమిటీ సభ్యులు వెంటనే వాటిని దగ్గరుండి తొలగించారు అంతేకాకుండా ఇదే పద్ధతి కొనసాగితేవారిపైకఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిసా కమిటీ సభ్యులు చెప్పాలి శంకర్రావు,జన్ని వెంకటరమణ, శెట్టి జయరాంకుమార్, మజ్జి రామకృష్ణ, వంతల భీమరావు మాతే అప్పలకొండ, నడిమిల్ మావూరు వంతల కోటేశ్వరరావు, జోసఫ్,పంచాయతీ సెక్రటరీపోలీస్ సూర్యనారాయణ మహిళా పోలీస్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News