విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3వ విడత వి ఆర్ఎస్ పథకాన్ని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. 2026 జనవరి 1నుంచి20 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు అర్హులు. 2027 తర్వాత సర్వీస్ ఉన్న వాళ్లకు ఈ పథకం వర్తిస్తుందని స్టీల్ ప్లాంట్ అధికారులు పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News