శబరిమల,ఐఏషియ న్యూస్: శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది.వారం క్రితం మాదిరిగా శబరిమల సన్నిధానంలో ఇసుకేస్తే రాలనంతగా అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. దీంతో అయ్యప్పస్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్లో భాగంగా ఈనెల 16న శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా తొలి నాలుగు రోజుల్లో రికార్డుస్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు.ఈ వారంరోజుల్లో ఆరున్నర లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు.ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News