డిడిఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా గురువారం ఉదయం చిత్తూరులో డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించి, అక్కడి నుండి వర్చువల్ గా రాష్ట్రవ్యాప్తంగా 77 నూతన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, …
Read More »admin
దివ్యాంగులకు సీఎం చంద్రబాబు వరాల జల్లు
నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు చోటు విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో దివ్యాంగులపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ మేరకు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం పలు 7 కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతే కాకుండా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని …
Read More »రాహుల్,ప్రియాంక గాంధీ లను కలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
గ్లోబల్ సమ్మేట్టుకు రావాలని ఆహ్వానం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటూ వారితో కీలక చర్చలు జరిపారు.హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ …
Read More »మొంథా తుపాను నష్టం రూ.6,352 కోట్లు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్,అనిత భేటీ తుపాను నష్టంపై నివేదిక అందజేత న్యూఢిల్లీ,చాన్విక జ్యోతిన్యూస్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనితలు భేటీ అయి మొంథా తుపాను నష్టంపై నివేదికను అందజేశారు.తుపాను కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనడమే …
Read More »ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలి
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులతో తాజా పరిస్ధితిపై చర్చించారు. అనంతరం ఆయన కీలక ప్రకటనలు చేశారు. అలాగే విద్యుత్ రంగం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు రాష్ట్రానికి ఎలా గుదిబండగా మారాయో వెల్లడించారు.ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు …
Read More »జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు
అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలిసిన సోదరి ఉజ్మాఖాన్ కరాచీ,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే మానసికంగా ఆయన తీవ్ర వేదన అనుభవిస్తున్నారని ఆయన సోదరి ఉజ్మాఖాన్ వెల్లడించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను మంగళవారం ఆమె కలిశారు. సోదరుడ్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మానసికంగా చాలా ధృఢంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు, …
Read More »జనవరి 1 న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటామంటే
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: క్షణాలు,నిమిషాలు, గంటలు,రోజులు,వారాలు,నెలలు,సంవత్సరాలు.. ఇలా కాలం గిర్రున తిరుగుతోంది. ఠక్కున క్యాలెండర్ మారిపోతోంది. మరీ క్యాలెండర్ కథేంటి? జనవరి 1వ తారీఖునే కొత్త సంవత్సరం అని సంబరాలు చేసుకుంటారు ఎందుకు? అసలు సంవత్సరాన్ని లెక్కించడానికి ప్రమాణం ఏంటి? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మీ మదిలో మెదులుతుంటాయి కదూ.అయితే ఈ క్యాలెండర్ కహాని తెలియాలంటే కొన్ని దశాబ్దాలు కాదు కాదు శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. కాలం వేసిన బలమైన ముద్రలను లోతుగా పరిశీలించాల్సిందే. ప్రపంచానికి జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం …
Read More »పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు బహుమతి
రాజస్థాన్,ఐఏషియ న్యూస్: రాజస్థాన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. Authored by: Vaddadi udayakumar
Read More »తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణను రాజకీయ నేతల్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ నేతల దిష్టి తగిలిదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్ను తప్పుబడుతూ ఇవాళ వరుస వార్నింగ్ లు ఇస్తున్నారు.తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ …
Read More »ఏపీలో అఖండ-2 టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో అఖండ-2 టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది.సింగిల్ స్క్రీన్స్లో రూ.75 పెంపు మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.10 రోజుల వరకు టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇవ్వడం జరిగింది.ఈ నెల 4న ప్రీమియర్షో టికెట్ ధర రూ.600గా ప్రభుత్వం నిర్ణయించింది. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News