admin

పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్: 19.20 లక్షల నగదు స్వాధీనం

పరవాడ,ఐఏషియ న్యూస్: పెదముషిడివాడ శివారులోని నక్కవా నిపాలెం పొలిమేరలో ఈ నెల 21న పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ తెలిపారు.ఈ సందర్భంగా పరవాడ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పేకాట వివరాలు తెలియజేశారు. నక్కవానిపాలెం గ్రామ పొలిమేరల్లో ఒక రహస్య ప్రదేశంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ఆర్.మల్లి కార్జునరావు తన సిబ్బందితో కలిసి …

Read More »

లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి

షరాఫ్ గ్రూప్ సంస్థకు సీఎం చంద్రబాబు ఆహ్వానం దుబాయ్,ఐఏషియ న్యూస్: షరాఫ్‌ గ్రూప్ వైస్ ఛైర్మన్,షరాఫ్ డీజీ సంస్థ వ్యస్థాపకుడు షరాఫుద్దీన్ షరాఫ్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం భేటీ అయ్యారు.రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై షరాఫ్‌తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మౌలిక వసతులు, మావన వనరుల లభ్యత, అలాగే ఇతర అనుకూలతల గురించివివరించారు.బుధవారం యూఏఈలో తొలిరోజు పర్యటనలో భాగంగా షరాఫ్ గ్రూప్,వైస్,చైర్మన్‌,సీఎంచంద్రబాబుసమావేశమయ్యారు.ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చించారు. షరాఫ్ గ్రూప్‌ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్స్‌ పార్కులను అభివృద్ధి …

Read More »

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శబరిమల,ఐఏషియ న్యూస్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమల శ్రీఅయ్యప్ప స్వామి ఆలయాన్ని బుధవారం దర్శించుకున్నారు. మెుదట పంబా నదిలో కాళ్లను కడుక్కోవడం ద్వారా సాంప్రదాయ శుద్ధి ఆచారాన్ని పాటించారు. అనంతరం ఆమె పంపా గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడే ఇరుముడిని సిద్ధం చేసుకుని అయ్యప్ప సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి 18 బంగారు మెట్లు ఎక్కి అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక అభిషేక …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వ‌ర్క్ఆసుప‌త్రుల‌కు 250 కోట్లు బకాయిలు విడుద‌ల

విజయవాడ,ఐఏషియ న్యూస్: డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ‌(నెట్వ‌ర్క్‌) ఆసుప‌త్రుల బ‌కాయిల్లో రూ.250 కోట్లను ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. నిధుల చెల్లింపుల‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో చ‌ర్చించారు. అనంత‌రం చ‌ర్య‌ల్లో భాగంగా నిధుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. అలాగే త్వ‌ర‌లో మ‌రో రూ.250 కోట్ల‌ను చెల్లించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ తెలిపారు.రోగుల‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైద్య‌ సేవ‌ల్ని కొన‌సాగించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ …

Read More »

ఎంవీపీలో దొంగనోట్ల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

        విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఇంట్లోనే దొంగనోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలో గల ఎంవీపీలో చోటు చేసుకుంది. ఈజీమనీ కోసం కొంతమంది కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా దొంగనోట్లు ముద్రించి ప్రజల్లో చలామణికి పాల్పడుతున్నారు. . దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఓ వ్యక్తి తన ఇంట్లోనే దొంగనోట్లు తయారు …

Read More »

ఐస్ల్యాండ్ లో తొలిసారిగా కనిపించిన దోమ

ఐస్ల్యాండ్,ఐఏషియ న్యూస్: ప్రపంచంలోనే దోమలు లేని దేశంగా పేరుగాంచిన ఐస్ల్యాండ్లో తొలిసారిగా దోమలు కనిపించాయి. వెస్ట్రన్ ఐస్ల్యాండ్లోని ఓ అడవిలో వీటిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు. ఇదివరకు విమానంలో ఒక దోమను గుర్తించినా, ఇప్పుడు సహజ వాతావరణంలో కనుగొనడం ఇదే తొలిసారి.వాతావరణ మార్పుల కారణంగానే ఈ కీటకాలు ఇక్కడికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.ఈ దోమల ఆగమనం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయనడానికి సంకేతం.దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. Authored by: Vaddadi udayakumar

Read More »

ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు

అమరావతి,ఐఏషియ న్యూస్: రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. బియ్యంతో పాటు రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రేషన్ షాపులు మినీ మాల్స్ గా మారనున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు షాపులు అందుబాటులో ఉంటాయి.అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే సరుకులు చేరే విధంగా సదుపాయం కల్పించనున్నారు.ఇక కార్డ్ …

Read More »

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

పెట్టుబడుల సాధనకు ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన పారిశ్రామిక వేత్తలతో రోడ్ షో,తెలుగు డయాస్పొరా సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనన్న ముఖ్యమంత్రి యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ 3 రోజుల్లో 25 సమావేశాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం.. ఇప్పుడు యూఏఈకి …

Read More »

సింహాచలం “ఈవో త్రినాధరావు” ఆకస్మిక బదిలీ

డిప్యూటీ కమిషనర్ సుజాతకు ఈవోగా అదనపు బాధ్యతలు సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిపాలనలో మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రస్తుత ఈవో వి త్రినాధరావు బదిలీ ఆకస్మికంగా కావడంతో, డిప్యూటీ కమిషనర్ సుజాతకు సింహాచలం దేవస్థానం ఈవో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్ లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇంత హడావుడిగా సింహాచలం ఈవో త్రినాధ రావు బదిలీపై సర్వత్ర చర్చంసనీయంగా మారింది. ఈ బదిలీ వెనక ఆంతర్యం ఏమిటా? అని దేవస్థానం ఉద్యోగులు,రాజకీయ ప్రముఖులు …

Read More »

రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: పీపీపీ విధానంలో నిర్వహణ

అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట,విజయనగరం జిల్లా ఎస్. కోట,పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,బాపట్ల జిల్లా అద్దంకి,నంద్యాల జిల్లా సున్నిపెంట,చిత్తూరు జిల్లా పీలేరు,శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైద్యశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఒక్కో కేంద్రంలో 5 చొప్పున రక్తశుద్ధి యంత్రాలు,ప్రతి కేంద్రానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటవుతాయని మంత్రి …

Read More »