admin

తుఫాను ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో నెలకొన్న తుఫాన్ ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగాచిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు,నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట,రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అదేవిధంగా కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకలో ఫీల్డ్‌ విజిట్ చేసిన సీఎం.నేలకొరిగిన వరి పొలాల పరిశీలించారు.తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం అన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేశారని సీఎం చంద్రబాబు అభినందించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించిన చిరంజీవి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏ ఐ సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిరంజీవి.అయితే మరోసారి తనపై సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు.ఈ మేరకు ఓ ఎక్స్ ఖాతాను జోడిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి.ఫిర్యాదు చేసినా ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని,వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన చిరంజీవి.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు. Authored by: Vaddadi udayakumar

Read More »

మొంథా తుఫాన్ పంట నష్టం వివరాలు 5 రోజుల్లో ఇవ్వండి

24 గంటల్లోగా పునరావాస శిబిరాల్లో కుటుంబాలకు రేషన్ విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణే లక్ష్యం మెరుగైన పారిశుధ్యంపై దృష్టి పెట్టండి తాగునీరు కలుషితం కాకుండా చూడండి… నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహరం తుఫాన్ అనంతర పరిస్థితులపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు  ఏపీ చీఫ్ బ్యూరో,చాన్విక జ్యోతిన్యూస్: మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు.. 2026 మార్చికల్లా అందుబాటులోకి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: మొబైల్‌లోని మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్‌ చేస్తే ఆ వ్యక్తి నంబర్‌ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ప్రస్తుతం ఆధారపడాల్సి వస్తోంది. ఇకపై ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సమయంలో మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత …

Read More »

చికిత్స పొందుతూ గర్భిణీ స్త్రీ మృతి

గొలుగొండ,ఐఏషియ న్యూస్: గొలుగొండ మండలం ఎటిగైరంపేట గ్రామానికి చెందిన మాకిరెడ్డి లోవ (27) అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందింది. తుఫాన్‌ నేపథ్యంలో హై రిస్క్‌ గర్భిణీలను ముందస్తు జాగ్రత్త చర్యగా ఈనెల 25న నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించాలని వైధ్యఅధికారులు ఆదేశాలు జారీ చేశారు.దీననుసరించి వైద్య సిబ్బంది లోవను ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, ఆమెను విశాఖ కేజీహెచ్‌ కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం ఆమెను …

Read More »

మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటిన మొంథా తుఫాన్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: మొంథా తీవ్రతుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీన పడనుందని వెల్లడించింది.తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, …

Read More »

లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో తలుపు తట్టింది

తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకున్న యువకుడు యూఏఈలో తెలుగు యువకుడికి వరించిన అదృష్టం 240 కోట్ల లాటరీ జాక్ పాట్ అబూదాబి,ఐఏషియ న్యూస్: యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్(29) అనే యువకుడుఅతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొనడంతో, ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్(240 కోట్లు) గెలుచుకున్న అనిల్ కుమార్.ఇందులో నా ప్రత్యేకత ఏమీ …

Read More »

Upcoming Vedanta Retreats in USA 2025

A series of programs blessed by the Jagadgurus of Sringeri Sri Sharada Peetham, introducing seekers to the timeless wisdom of the Upanishads and Advaita. Presented in a structured and accessible way,these sessions  bring out the essence of vedanta- inspiring reflection, deepening understanding, and connecting participants with its living tradition.

Read More »

మొంథా తుఫాన్ కారణంగా ఎన్ హెచ్16లో వాహనాల రాకపోకల తాత్కాలిక నిలిపివేత

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడి అనకాపల్లి,ఐఏషియ న్యూస్: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ మరియు ఆస్తి భద్రతను కాపాడే లక్ష్యంతో మంగళవారం రాత్రి 7 గంటల నుండి నేషనల్ హైవే–16పై అన్ని రకాల వాహనాల రాకపోకలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు.తుఫాన్ తీవ్రతను పరిగణనలోకితీసుకుని,భారీవర్షాలు,ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనాలను రహదారి పక్కన భద్రంగా నిలిపివేయాలని సూచించారు. వాహనదారులు తమ భద్రత కోసం సమీపంలోని పార్కింగ్ …

Read More »