admin

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1,750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి తెలిపారు.ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయంఉపాధితో జీవించేవారు,18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులని మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏపీ గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలు

        ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో ఉన్న గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రామపంచాయతీల పునర్ వ్యవస్దీకరణ, సిబ్బంది కూర్పు, కార్యదర్శుల పదవుల వర్గీకరణ, ప్రమోషన్లు వంటి పలు నిర్ణయాలు ఉన్నాయి. వీటిని తక్షణం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించనున్నారు.ఇప్పటికే కేబినెట్ లో ఆమోదించిన ఈ నిర్ణయాలు క్షేత్రస్దాయిలో అమలు చేయనున్నారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు గ్రామ …

Read More »

కేజీహెచ్ కు దివిస్ సంస్థ 2.50 లక్షల విలువైన 3 సీటర్ల 25 రోచైర్లు విరాళం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజిహెచ్) డివిస్ ల్యాబొరేటరీస్ వారు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా రూ.2.50 లక్షల విలువైన 3 సీటర్ల 25 రోచైర్లు మంగళవారం విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, సిఎస్‌ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్ ఉ. శ్రీహరి, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్.డాక్టర్.శ్రీనివాస్ పాల్గొన్నారు.సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి దివిస్ ల్యాబొరేటరీస్ వారి ఉదార సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ,ఈ చైర్లు ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

Experience the Soul of United India: Grand ‘Bharat Bharathi’ Celebration on November 9, 2025

Hyderabad: Prepare to be mesmerised by a vibrant tapestry of India’s diversity as Bharat Bharathi presents a spectacular cultural extravaganza on Sunday, November 9, 2025, at Lal Bazaar, Ayyappa Temple, Trimulgherry. This one-of-a-kind programme is a heartfelt tribute to Sardar Vallabhbhai Patel’s 150th Birth Anniversary, celebrating the unbreakable spirit of Ek Bharat, Shreshtha Bharat. A Feast for the Senses: Culinary …

Read More »

గత ప్రభుత్వ హయాంలో నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు

మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు ఫ్యామిలీపై క్రిమినల్ కేసులు పెట్టారని ఆరోపణ అమరావతి రైతుల పోరాటాన్ని కొనియాడిన మాజీ సీజేఐ అమరావతి,ఐఏషియ న్యూస్: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ, …

Read More »

మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల మధ్య లోక్ పోల్ …

Read More »

తుఫాన్ లో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనితకు అవార్డు ఇచ్చిన సీఎం

అమరావతి,ఐఏషియ న్యూస్: మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులను, సిబ్బందిని శనివారం అమరావతిలోని ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రశంసా పత్రం మరియు ఉత్తమ సేవా అవార్డు ను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. తుఫాను సమయంలో ప్రజల రక్షణ, సహాయక చర్యల సమన్వయంలో కీలక పాత్ర …

Read More »

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట

9 మంది భక్తులు దుర్మరణం శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతులంతా మహిళా భక్తులు. కార్తిక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ఘటనాస్థలిలో సహాయ చర్యలుకొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ప్రైవేటు దేవాలయం అని దేవాదాయశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కేవలం రెండు నుంచి మూడు వేల వరకు భక్తులు బట్టి ఆలయంలో …

Read More »

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం

తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం ఘటన జరిగిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశాం ఇకపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన దేవాలయాలపై నిరంతర పర్యవేక్షణ కాశీబుగ్గ దేవాలయానికి అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలిరావడం వల్ల తోపులాట పలాసలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కాశీబుగ్గ ఆలయంలో తోపులాట జరిగిన ప్రాంతం పరిశీలన పలాస సీహెచ్ సీలో క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్ పలాస,ఐఏషియ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలిరావడం వల్ల …

Read More »

అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు ఆహ్వానించబడ్డ డాక్టర్ బారువా,డాక్టర్ పాణిగ్రాహి ముగిసిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి) సెమినార్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలోని హెల్త్ సిటీ, అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ క్యాథ్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ డి కె బారువ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎన్ కే పాణిగ్రాహి ఇటీవల ముగిసిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి), 2025లో అంతర్జాతీయ అధ్యాపకులుగా ఆహ్వానించబడ్డారు. అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి), 2025లో అంతర్జాతీయ అధ్యాపకుడిగా ఆహ్వానించబడ్డారు. డయాబెటిస్, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి పెరుగుతున్న ప్రాబల్యం, బెలూన్ యాంజియోప్లాస్టీ (పీటీసీఏ) ద్వారా సిసిఏడి చికిత్సలో ఎక్కువమంది వృద్ధ రోగులను …

Read More »