admin

బెట్టింగ్ యాప్‌ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడి గట్టి షాక్

11.14 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ అటాచ్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరికి చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో మాజీ …

Read More »

మీరు ఎవరిని “డిసైడ్ చేస్తే” వారే అధికారంలోకి

వైఎస్సార్సీపి స్టూడెంట్ వింగుకు దిశా నిర్దేశం చేసిన మాజీ సీఎం జగన్ తాడేపల్లి,ఐఏషియ న్యూస్: మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం దిశగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అనుబంధ సంఘాల నేతలకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక నుంచి తాను కార్యకర్తలతో మమేకవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం త్వరలోనే సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. అదే సమయంలో చంద్రబాబు పాలన పైన జగన్ ధ్వజమెత్తారు. ఫీజు బకాయిలు.. మెడికల్ కాలేజీల విషయంలో పోరాటానికి సిద్దం …

Read More »

పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి సారూ..

అరకులోయ,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని బి.బొడ్డపుట్టు పంచాయతీ పరిధి దబ్బాగరువు గ్రామానికి చెందిన విద్యార్థిని పాంగి దేవి తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటుంది.బి.బొడ్డపుట్టు ఎంపీపీ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నానని పుట్టుకతో దివ్యాంగురాలు.రెండు కాళ్లు రాక వీల్ చైర్లో తన సోదరుడు రోజు కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు తీసుకువేళ్తారని చెప్పింది.పింఛన్ కోసం తమ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగిన పింఛన్ నేటికీ మంజూరు కాలేదని,ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేసి తనను ఆదుకోవాలని …

Read More »

ఆసీస్‌ను చిత్తుచేసిన భారత్‌

క్వీన్‌లాండ్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 119 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (30)టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సుందర్‌ 3, అక్షర్‌ 2, శివమ్‌ 2 వికెట్లు తీశారు.అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది.తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం …

Read More »

అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

తిరుమల,ఐఏషియ న్యూస్: అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది.ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఎఫ్ ఐ పి ఓ (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. Authored by: Vaddadi udayakumar

Read More »

డ్ర‌గ్స్ కేసులో కొండారెడ్డి అక్ర‌మ అరెస్ట్

రాష్ట్ర మాజీ మంత్రి, అనకాపల్లి వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపణ విశాఖ‌ప‌ట్నం,ఐఏషియ న్యూస్: ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తుంటే ఓర్వ‌లేక‌పోతున్న కూట‌మి ప్ర‌భుత్వం చివ‌రికి విద్యార్థుల జీవితాల‌ను కూడా నాశ‌నం చేయ‌డానికి వెనుకాడ‌టం లేద‌ని, వైయ‌స్సార్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కొండారెడ్డి మీద అక్ర‌మంగా డ్ర‌గ్స్ కేసు పెట్టి వేధించ‌డ‌మే దానికి ఉదాహ‌ర‌ణ అని విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి జిల్లాల వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు కెకె రాజు, గుడివాడ అమ‌ర్నాథ్ స్ప‌ష్టం చేశారు. విశాఖ‌లోని పార్టీ కార్యాల‌యంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ …

Read More »

హుస్సేన్‌సాగర్‌ లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఓ వివాహిత క్షణికావేశంలో తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్‌సాగర్‌ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్ వ్యాపారం చేస్తుండగా ఆయన భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి బియ్యారా అనే రెండేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కీర్తిక గత ఏడాదిన్నరగా తన కుమార్తెతో కలిసి బహదూర్‌పురలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దే …

Read More »

మహిళా వరల్డ్ కప్ క్రికెటర్లతో ప్రధాని మోడీ భేటీ

        న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి మహిళల ప్రపంచ కప్ ఆడిన క్రికెటర్లతో భేటీ అయ్యారు. వరల్డ్ కప్ టైటిల్ విజయంపై ప్రధాని మోడీ క్రికెటర్లను అభినందించారు.అదే సమయంలో వరుసగా మూడు పరాజయాలు, సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్‌లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. దీంతో క్రికెటర్లు కూడా తాము ఎదుర్కొన్న పరిస్ధితుల్ని ప్రధానితో పంచుకున్నారు.మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ …

Read More »

తెలంగాణ కేబినెట్ నుంచి “ముగ్గురు మంత్రులు” అవుట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో భారీ మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని, కొందరు మంత్రులు పదవులు కోల్పోతారని సమాచారం. కొత్తగా ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతారని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈనెల 11 తర్వాత మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ఎదురుచూస్తున్నారు.తాజాగా ఎమ్మెల్సీ అజారుద్దీన్ కి మైనార్టీ సంక్షేమశాఖ …

Read More »

విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే విస్తరణ

నేషనల్ హైవే 65 విస్తరణకు కేంద్రం ఆమోదం విజయవాడ,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 పై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.నేషనల్ హైవే 65 ను విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిని విస్తరించే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం అవసరమైన భూ సేకరణ ప్రక్రియ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నేషనల్ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ నేషనల్ హైవే 65 విస్తరణలో …

Read More »