బాపట్ల,ఐఏషియ న్యూస్: బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన 75 ఏళ్ల వృద్దుడు చిలంకూరి కాంతయ్య ఇంకొల్లులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాను తాకట్టు పెట్టుకున్న బంగారు నగలను విడిపించుకోవాలని వచ్చాడు.అందుకు బ్యాంకులో కట్టాల్సిన 3 లక్షల 90 వేల రూపాయలు తీసుకుని బ్యాంకులోకి వెళ్లాడు.బ్యాంకు అధికారులు మరో 10 వేల రూపాయలు వడ్డీ అయిందని, మొత్తం 4 లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు. దీంతో మరో 10 వేల రూపాయలు ఇంటికి వెళ్లి తీసుకురావడానికి తన సైకిల్పై బయలుదేరేందుకు సిద్దమయ్యాడు.తన వెంట తీసుకొచ్చిన 3 …
Read More »admin
కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కింగ్ జార్జి ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొని ఎక్స్రే ఆవిష్కర్త డాక్టర్ రాంట్జెన్ కి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేడియాలజిస్టుల సంఘ అధ్యక్షులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ సేవల పట్ల అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ వాణి సందేశాన్నిస్తూ ప్రజల నుండి రేడియాలజీ సేవల కోసం ఎంతో ఒత్తిడితో కూడిన డిమాండ్ ఉన్నప్పటికీ కేజీహెచ్ లో మంచి సేవలు అందిస్తున్నారని హర్షం …
Read More »Hindus of DFW Hosts Annual Diwali – Sparkle of Joy Civic Reception Civic Leaders, Interfaith Partners, and Dignitaries from India and New York Gather to Celebrate Unity and Service
The Annual Diwali – Sparkle of Joy Civic Reception, hosted by Hindus of DFW, brought together a distinguished gathering of civic leaders, Hindu American community representatives, interfaith partners, and international dignitaries for an evening of cultural celebration, civic engagement, and shared purpose. Held in Dallas, the event welcomed Mayors, Mayor Pro Tems, and Council Members from over 15 cities across …
Read More »604 బస్సులపై కేసులు…102 బస్సులు సీజ్
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది.12 బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించి, అత్యవసర నిష్క్రమణ, అగ్నిమాపక యంత్రం వంటి భద్రతా లక్షణాలను పరిశీలించారు. 4,452 బస్సులను తనిఖీ చేసి, 604పై కేసులు నమోదు చేయగా, 102 బస్సులు సీజ్ అయ్యాయి.అక్టోబర్ 24న హైదరాబాద్ నుండి బెంగళూరు వస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. …
Read More »శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా…రూ.2.5 కోట్ల నగదు పురస్కారం
గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఇంటి స్థలం మంజూరు సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి విజయవాడ,చాన్విక జ్యోతిన్యూస్: భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచకప్ గెలుచుకోవడం ద్వారా టీన్ఇండియా జట్టు సత్తా చాటిందని.. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా …
Read More »55 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ.107 కోట్లు రికవరీ
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: సైబర్ నేరగాళ్ల వలలో అనేకమంది చిక్కుతున్నారు. మాయమాటలతో అమాయకులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు.రోజుకో రకంగా కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తూ నగదును దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్లు,మెసేజ్ లింక్ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువవడంతో పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్లో సైబర్ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదు …
Read More »కేజీహెచ్ లో అంధకారం: ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ సీఎం జగన్
తాడేపల్లి,ఐఏషియ న్యూస్: ప్రతిష్ఠాత్మక విశాఖ కేజీహెచ్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రోగులు అంధకారంలో మగ్గిపోయారు. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని …
Read More »2027లో మాజీ సీఎం జగన్ మరోసారి “ప్రజాసంకల్ప” పాదయాత్ర
మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పేర్ని నాని వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన తర్వాతే 2004లో అధికారంలోకి వచ్చారు.ఆ తర్వాత చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం ప్రారంభించారు. ఇక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర నిర్వహించారు.ఆ తర్వాతే ఆయన ఎన్నికల్లో గెలిచి …
Read More »గ్రామ సచివాలయాలను “విజన్ యూనిట్లు” గా పేరు మార్పు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: పేరు మార్పు తక్షణమే అమల్లోకి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశం ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థ పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ సచివాలయాలు ఇకపై “విజన్ యూనిట్స్” గా పిలవబడతాయని తెలిపింది. ఈ …
Read More »21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం, వడ్డీకాసుల వాడు,ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమలకు రానున్నారు. ఈ నెల 21న రాష్ట్రపతి స్వామివారి సేవలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపదీ ముర్ము తిరుపతికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఈనెల 21న ఆలయ సంప్రదాయం ప్రకారం.. మొదట శ్రీ వరాహస్వామి వారిని, …
Read More »
News Website (iasianews.net) I Asia News