Spiritual

మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ 30 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు అందజేత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాల ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ద్వారకా తిరుమల, కొయ్యలగూడెం మండలాల్లో పర్యటించారు. రాజమండ్రి మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం చేరుకుని …

Read More »

విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.పుట్టపర్తిలో శనివారం నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.‘‘విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు.ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి.ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు.సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు.ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ద్రౌపదీ ముర్ము అన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

నేడు పోలి స్వర్గం నోము (పోలి పాడ్యమి)

స్పెషల్ డెస్క్ (ఆధ్యాత్మికం),ఐఏషియ న్యూస్: స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో ‘పోలి స్వర్గం నోము’ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది. ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది … చిన్నది …

Read More »

ఘనంగా భగవాన్ సత్యసాయి శ‌త‌జయంతోత్సవాలు

జయంతోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సత్య సాయి బాబా స్మారక వంద రూపాయల జ్ఞానం పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి వేదికగా స‌త్య‌సాయి శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ మేరకు ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సాయి …

Read More »

డిసెంబర్ 30 నుంచి పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం

సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్న టీటీడీ టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. పాలక మండలి సభ్యుడు, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై ముఖ్యంగా చర్చించారు.డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఉత్తర ద్వార దర్శనంలో …

Read More »

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభం

ఏపీ చీఫ్ బ్యూరో,చాన్విక జ్యోతిన్యూస్: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా, వేలాది మంది భక్తులు “సాయి నామస్మరణ” చేశారు. మంగళవారం ఉదయం వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టం వెండి రథోత్సవం. ఈ రథం 31.8 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపై 9.2 కిలోల బంగారంతో చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. రథం తయారీకి 180 కిలోల వెండిని, బంగారు పూత …

Read More »

మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో ఫేక్ టీటీడీ దర్శన లెటర్లు

విజయవాడ,ఐఏషియ న్యూస్:  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకీలీ టీటీడీ దర్శన లెటర్లు జారీ అవ్వటం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి పీఏ సోమవారం విజయవాడ నగర కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిటిడి కి జారీ చేస్తున్న ఇటువంటి నకిలీ లెటర్లు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. Authored by: Vaddadi …

Read More »

సింహాచలం దేవస్థానంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

సింహాచలం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం,సింహాచలంలో విస్తృత స్థాయిలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.భక్తులకు అత్యంత పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.సుజాత ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం శ్రద్ధగా అమలు చేయబడింది. డిప్యూటీ ఈ.ఓ. సింగం రాధ, సహాయ కార్యనిర్వహణాధికారులు కె.తిరుమలేశ్వరావు, వాడ్రేవు రమణమూర్తి కార్యక్రమాన్ని …

Read More »

సత్యదేవ నిత్యాన్నదాన ట్రస్టుకు లక్ష విరాళం

అన్నవరం,ఐఏషియ న్యూస్: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి చెందిన శ్రీ సత్యదేవ నిత్య అన్నదాన ట్రస్ట్ కు శనివారం భక్తులు అల్లూరి సూర్యనారాయణ రాజు, శ్రీమతి సూర్యచంద్ర కాంతం పేరుమీదుగా 1,00,000 రూపాయలు విరాళముగా అందజేశారు.ఈ విరాళమును ప్రతీసంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహణ కోసం భక్తి శ్రద్ధలతో సమర్పించారని దేవస్థాన అధికారులు తెలిపారు.భక్తుల సేవా భావం, సమర్పణ భావనకు దేవస్థానం కృతజ్ఞతలు తెలియజేసింది.శ్రీ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ భక్తులందరిపై ఉండాలని …

Read More »

టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు కోటి విరాళం

తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విజయవాడకు చెందిన భక్తుడు చక్కా మోనిష్ వెంకట సత్యప్రకాష్ తరపున ప్రతినిధి భూషణ్ శుక్రవారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడును కలసి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. విరాళం అందజేసిన సత్య ప్రకాష్ కు టీటీడీ తరఫున చైర్మన్ బి ఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »