విజయవాడ,ఐఏషియ న్యూస్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకీలీ టీటీడీ దర్శన లెటర్లు జారీ అవ్వటం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి పీఏ సోమవారం విజయవాడ నగర కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిటిడి కి జారీ చేస్తున్న ఇటువంటి నకిలీ లెటర్లు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News