గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు

అమరావతి,ఐఏషియ న్యూస్: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నెలకొన్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేయడం జరిగింది.2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ చేయాలని నిర్ణయించారు.ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం.ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అలాగే గోదారి పుష్కరాలు నిర్వహణ కోసం మంత్రుల కమిటీని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ధ్వజ స్తంభాలు,రథాలు తయారీకి 100 ఎకరాల్లో వృక్షాలు పెంచాలని టిటిడి నిర్ణయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఏర్పాటైన ఈ సమావేశానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *