Recent Posts

రాజధాని అమరావతి సమీపంలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు

అమరావతి,ఐఏషియ న్యూస్:ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి దగ్గరలో గల 300 అడుగుల నీరుకొండ కొండపై బేస్ 100 అడుగులతోపాటు 200 అడుగుల ఎత్తుగల విగ్రహం నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డి పి ఆర్ టెండర్లు ఆహ్వానించింది. ఈ విగ్రహం బేస్ లో మ్యూజియం,మినీథియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉండేలా నిర్మాణం చేపడతారు.యాక్సెస్ కోసం ఎస్కలేటర్లు లిఫ్ట్లునిర్మిస్తారు. Authored by: Vaddadi udayakumar

Read More »

బాలకృష్ణ చిరంజీవి వివాద పరిష్కారానికి ఆచితూచి అడుగులు

రేపు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో చిరంజీవి అభిమానుల సమావేశం ఏపీ స్టేట్ బ్యూరో ,ఐఏషియ న్యూస్:  మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు. బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు. చిరంజీవి స్పందనతో ఇప్పుడు ఈ వ్యవహారం సినీ-పొలిటికల్ వివాదంగా మారుతోంది. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ డిప్యూటీ సీఎం పవన్. ఎమ్మెల్సీ నాగబాబు స్పందించలేదు. …

Read More »

టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె మౌనిక డీఎస్పీగా ఎంపిక

ములుగు,ఐఏషియ న్యూస్:  పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు.ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీగా ఎంపికైన మౌనికను పలువురు అభినందించారు. Authored by: Vaddadi udayakumar

Read More »