Recent Posts

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విఆర్ఓ పృధ్వీ

కశింకోట,ఐఏషియ న్యూస్: మండలంలోని నర్సింగపల్లి వీఆర్వో 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు ఏసిబి డిఎస్పి బి. వి.యస్. నాగేశ్వరరావు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.నరసింగపల్లి గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న సూర్య కృష్ణ పృద్వి, నరసింగపల్లి గ్రామానికి చెందిన వి నాగేశ్వరరావు అనే రైతు కు చెందిన రెండు ఎకరాల 10 సెంట్లు భూమికి ముటేషన్ దరఖాస్తు సిఫార్సు చేసి,ప్రాసెస్ చేయడానికి 20 వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో నర్సింగపల్లి సచివాలయంలో గురువారం ఆ …

Read More »

కనకదుర్గమ్మకు హుండీల ద్వారా 4 కోట్ల 50 లక్షలు ఆదాయం

విజయవాడ,ఐఏషియ న్యూస్: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హుండీని. గురువారంఆలయం అధికారులు లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపుల్లో మొత్తం రూ.4.50 కోట్లకుపైగా కానుకలు, ఇతర ఆభరణాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గత 31 రోజుల్లో వచ్చిన హుండీ ఆదాయాన్ని తాజాగా అధికారులు లెక్కించారు. ఇక డబ్బుతోపాటు, బంగారు నగలు, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ..హుండీలో లభించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.ఇక విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి ఆలయ ఈవో …

Read More »

ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్

ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలు ఏపీ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ఏపీ చీఫ్ బ్యూరో ఐఏషియ న్యూస్: అమరావతిలో గురువారంసమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ – పీఎంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్‌లో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు …

Read More »