Recent Posts

150 మంది విద్యార్థులకు ఉచితంగా ఐడి కార్డుల పంపిణీ

పామూరు,ఐఏషియ న్యూస్: పామూరు మండలం మారకొండాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేయుచున్న అట్లా వెంకటేశ్వర్లు సమకూర్చిన 7,000 ఆర్థిక సహకారంతో తయారు చేసిన స్టూడెంట్ఐ డికార్డులను ఉచితంగా శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఐడికార్డులను ప్రధానోపాధ్యాయులు చావా శ్రీనివాసులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు కె. భాస్కరరెడ్డి,అట్లా వెంకటేశ్వర్లు,ఎస్.చైతన్య,వి.రమేష్ బాబు,ఎం.విజయ,డి.శ్రీలక్ష్మి,వి.జానకి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

దొంగ మస్తర్లతో ఉపాధి హామీలో నిధులు గోల్ మాల్

అనకాపల్లి /బుచ్చయ్యపేట,ఐఏషియ న్యూస్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ బుచ్చయ్యపేట మండలంలో ఈ నిధులు ఖర్చు కాగితాల పైనే కనిపిస్తున్నాయి కానీ పనులు జరిగాయంటూ అధికారులు, సాంకేతిక సిబ్బంది రికార్డులు చూపుతున్నా నేలమీద మాత్రం వాస్తవంగా కంటికి కనిపించడం లేదు.కోట్లు ఖర్చు చేశామని పేపర్లలో చూపిస్తుంటే, కూలీలకు మాత్రం ఒక్క రూపాయి ప్రయోజనం అందకపోవడం తో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం చెందుతున్నారు. అరకొర పనులు చేసి, …

Read More »

అనారోగ్యంతో సిపిఐ మాజీ ఎంపీ సురవరం మృతి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్:  కమ్యూనిస్టు ఉద్యమానికి అపారమైన సేవలందించిన సీపీఐ జాతీయ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి గురువారం రాత్రి నుంచి విషమించగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సురవరం మహబూబ్‌నగర్‌ (పాలమూరు) జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. …

Read More »