యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ మృత తిమింగలం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలంను విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, 64 వ వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు చోడిపిల్లి ముసలయ్య , అధికారులతో కలిసి బయటకు తీయడం జరిగింది ఈ తిమింగలము చనిపోయి ఒడ్డుకు కొట్టుకొని రావడం వలన బయటకు తీసి ఆ తిమింగల మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు.
తిమింగలం సుమారుగా 3టన్నులు బరువు,15 అడుగుల పొడవు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇలా సముద్రపు అలల దాటికి భారీ తిమింగలం కొట్టుకు రావడం ఇదే మొదటిసారి. ఈ తిమింగలాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ భారీ తిమింగలను తమ సెల్ఫోన్లో చిత్రీకరించుకున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మంత తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అప్రమత్త చర్యలు

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి,ఐఏషియ న్యూస్: వచ్చే కొన్ని రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించిన ‘మంత’ తుఫాను హెచ్చరిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *