న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్-గ్యారంటీ ఫర్ రోజ్ర్, ఆజీ వికా మిషన్ పై ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.చట్టంలోని కీలక నిబంధనలు, చట్టబద్ధ హక్కులపై శ్రామికులు, ప్రజలకు గ్రామసభల్లో అవగాహన కల్పించడంతో పాటు చర్చించనున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. Authored by: Vaddadi udayakumar
Read More »Uncategorized
30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్.
నంద్యాల,ఐఏషియ న్యూస్: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంను ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ అధికారిగా శ్యామ్ రాజు ఏడాది జూన్ 30న రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుండి ఖజానా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 45వేలు రూపాయలు డిమాండ్ చేయగా 30వేలు రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. శ్యామ్ రాజు ఫిర్యాదిదారుడు మేరకు ఏసీబీ …
Read More »సైబర్ ఫ్రాడ్కు బలైన పంజాబ్ మాజీ ఐజీ.. తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య
భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు పోగొట్టుకున్న అమర్ సింగ్ చాహల్ 12 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పాటియాలా,ఐఏషియ న్యూస్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ కన్నుమూశారు. భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు నష్టపోయిన ఆయన తీవ్ర మనస్తాపంతో సోమవారం తననివాసంలోతుపాకీతోకాల్చుకున్నారు. డైలి జాగరణ్ కథనం ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.పాటియాలాలోని తన నివాసంలో సెక్యూరిటీ …
Read More »భారత నిపుణులకు అమెరికా గట్టి దెబ్బ
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుతో పెరుగుతున్న అనిశ్చితి భారత ఐటీ నిపుణులు, వైద్యులపై తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: హెచ్-1బీ,హె-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది.ప్రామాణిక వీసా స్క్రీనింగ్లో భాగంగా ఆన్లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) పరిశీలనను అన్ని హెచ్-1బీ,హె-4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.ఈ నెల 15 నుంచి ఈ కొత్త విధానం …
Read More »ఏసీపీతో సహా సీఐ,ఎస్ఐలు సస్పెన్షన్
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ గోపి,ఎస్ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు సోమవారం జారీచేశారు.వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదురావడంతో దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ డీజిపి శివధర్ రెడ్డి …
Read More »లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈఈ సత్యమూర్తి
రాయచోటి,ఐఏషియ న్యూస్: రాయచోటి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్పీయం సెక్షన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి.గాలివీడు మండలానికి చెందిన ఓ రైతు నుంచి15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ గాలివీడు ఏఈఈ సత్యమూర్తి. లంచం తీసుకున్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యమూర్తి ఏసీబీ కోర్టు తరలించారు. Authored by: Vaddadi udayakumar
Read More »హుకుంపేట మోడల్ ప్రాథమిక పాఠశాల భవనిర్మాణం పూర్తిచేయాలి
హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గల హుకుంపేట గ్రామంలో నిర్మాణ దశలో ఆగిపోయి ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాల భవనం పూర్తి చేయాలని సర్పంచ్ పూర్ణిమను ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ కోరారు. సర్పంచ్ పూర్ణిమ ఇదే విషయాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజకి శుక్రవారంవినతి పత్రం అందజేయడం జరిగింది.హుకుంపేట గ్రామంలో గల పాఠశాలకు సొంత భవనం లేక మరొక పాఠశాల హై స్కూల్, భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారని,ఇటీవలే భారీ వర్షాలు కారణంగా ప్రస్తుతం ఉన్న …
Read More »187 హోమ్ గార్డ్ పోస్టులకు 8వేల మంది పోటీ..రన్వేపైనే పరీక్ష నిర్వహణ
భువనేశ్వర్,చాన్విక జ్యోతిన్యూస్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో కేవలం 187 హోమ్ గార్డ్ పోస్టులకు ఏకంగా 8వేలమంది పోటీపడ్డారు. వీరిని నియంత్రించడం కష్టంగా మారటంతో చేసేదేం లేక అధికారులు జమదర్పాలి ఎయిస్ట్రిప్ రన్వేనే ఎగ్జామ్ హాల్ గా మార్చేశారు. అభ్యర్థులందరూ ఎండలోనే కూర్చుని పరీక్ష రాశారు.ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత 5వ తరగతి మాత్రమే. కానీ పోటీ పడ్డ వారిలో డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు కూడా ఉండటం గమనార్హం. Authored by: Vaddadi udayakumar
Read More »లంచం తీసుకుంటూ దొరికిన డిడి,సీనియర్ అసిస్టెంట్, రిటైర్డ్ ఉద్యోగి
కాకినాడ,ఐఏషియ న్యూస్: కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు.కారుణ్య నియామకం,పెన్షన్ సెటిల్మెంట్ పనుల నిమిత్తం 40 వేల లంచం తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారెపు సూర్య శివప్రసాద్లు ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన గెద్దాడ చక్రవర్తి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.లంచం వ్యవహారంలో మాజీ ఉద్యోగి యాదల సత్యనారాయణను మధ్యవర్తిగా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుడు చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు …
Read More »డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.అందులో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు.మావోయిస్టుల నుంచి పోలీసులు 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కామారెడ్డి జిల్లా వాసి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ కాగా మిగతా …
Read More »
News Website (iasianews.net) I Asia News