హైదరాబాద్,ఐఏషియ న్యూస్: గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ గోపి,ఎస్ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు సోమవారం జారీచేశారు.వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదురావడంతో దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ డీజిపి శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ తెలంగాణ పోలీస్ విభాగంలో కలకలం రేపింది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News