Uncategorized

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్

ఆనందపురం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: ఆనందపురం మండలంలోని వేములవలస వద్ద కారును వెనక నుండి ఆర్టిసి బస్సు ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అవ్వగా ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కలగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి కి చెందిన జి గోవింద్ తో పాటు మరో వ్యక్తి చీపురుపల్లి నుండి మధురవాడ వెళ్తుండగా హైవే నుండి వేముల వలస పెట్రోల్ బంక్ వైపు సర్వీస్ రోడ్లో వస్తుండగా అదే సమయంలో విజయనగరం నుండి పాత గాజువాక వెళ్తున్న గాజువాక డిపో ఆర్టీసీ బస్సు వెనక …

Read More »

5 వేలకే ఈ-సైకిల్.. రాష్ట్రంలో కొత్త మొబిలిటీ విప్లవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం

అమరావతి,ఐఏషియ న్యూస్: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పథకాల పరిధిలో 23,999 విలువైన ఈ-సైకిళ్లను కేవలం 5 వేలకే ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ఈ పథకానికి తొలి అడుగు సీఎం చంద్రబాబునాయుడు సొంతనియోజకవర్గమైన కుప్పంలో పడనుంది. అక్కడ మొదటి విడతగా ఈ-సైకిళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. విద్యార్థులు, యువత, ఉద్యోగులకు ఈ విధానం ప్రత్యక్ష లాభం చేకూర్చేలాకార్యాచరణరూపొందించారు.అమ్మాయిలు, అబ్బాయిలకు …

Read More »

20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ  అధికారులకు పట్టుబడ్డారు.ఫిర్యాదుదారునిపై నమోదైన పిడిఎస్ రైస్ కేసును తొలగించడానికి, అలాగే అతనికి విధించిన జరిమానా ప్రక్రియలు పూర్తి చేసి రేషన్ షాప్‌ను తిరిగి తెరవడంలో సహాయం చేస్తానని చెబుతూ 20వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసిన హనుమ రవీందర్ నాయక్, ఈ సందర్భంగా ప్రియదర్ నుండి నగదు తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి పట్టుబడి అరెస్టయ్యారు.నిందితుడిని ఏసీబీ కోర్టుకు తరలించారు. …

Read More »

జస్ట్ రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, ప్రక్రియను సులభతరం చేసింది.నామమాత్రపు స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ నెల 9 నుంచి ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన …

Read More »

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ముమ్మిడివరం,ఐఏషియ న్యూస్: ముమ్మిడివరంలోని గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అమలాపురం డి.ఎస్.పి. టి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. కాట్రేనికోన మండలంలో ఓ గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న మోకా గిరిబాబు, నేరేడుమిల్లి అర్చనా దేవి ఈనెల 3వ తేదీన హాస్టల్‌కు వెళ్లి.. అక్కడి …

Read More »

నేటి అర్ధరాత్రి నుండి గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ బంద్

విజయవాడ,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో సరుకు రవాణా నిలిచిపోనుంది. లారీల యాజమానుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై మోపిన ఈ అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించు కోకపోతే ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక నిరసనకు దిగాలని లారీ ఓనర్స్ అసోసి యేషన్ నిర్ణయం తీసుకుంది. సమ్మె జరిగితే నిత్యావసరాల నుంచి అన్నింటి పైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు రవాణా శాఖ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.లారీల యాజమానుల సంఘం కీలక ప్రకటన …

Read More »

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా సోమవారం విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఇ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె. సాయిదీపక్ ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. …

Read More »

ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్ కు ఎంపికయిన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లేఖ రాసింది. రాష్ట్రకేడర్ కు కేటాయించినవారిలో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కె.ఆదిత్యశర్మ, చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హరిఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హరియాణా), ప్రియ (దిల్లీ), సుయష్ కుమార్ (ఉత్త రప్రదేశ్)లు ఉన్నారు.ఏపీ స్వరాష్ట్రంగా ఉన్న చెన్నంరెడ్డి …

Read More »

గోవాలో అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం.. 23 మంది మృతి

గోవా,ఐఏషియ న్యూస్: గోవాలోని అర్పోరాలో ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది కిచెన్ సిబ్బంది ఉండగా.. పలువురు పర్యాటకులు కూడా ఉన్నారని అధికారు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏసీఏ త‌రపున ఇండియా క్రికెటర్లకు జ్ఞాపికలు అందజేత

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో మూడోవ‌న్డే త‌ల‌పడేందుకు విశాఖ విచ్చేసిన ఇండియా క్రికెట్ టీమ్ కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ ఓపెన‌ర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, కోచ్ గౌత‌మ్ గంభీర్ లకు ఏసీఏ త‌రుఫున జ్ఞాపిక‌లు అంద‌జేశారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సి.వో.వో గిరీష్ డోంగ్రీ, ఏసీఏ …

Read More »