ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు.ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం.ఆంధ్రప్రదేశ్ కి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులుగా పేర్కొన్నారు.28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా తుఫాను.ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళరాదు.దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు.ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన.దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి.మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు,గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు వడలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News