విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పాకిస్తాన్ తో సంబంధాలకు సంబంధించి విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల 10 నెలల జైలు శిక్షను,ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.దీనితో ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించినట్లు ఎన్ఐఏ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News