అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాజధాని అమరావతిలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం 4,618 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఫేజ్–1లో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన రన్వేను నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయాన్ని ‘కోడ్–4ఎఫ్’ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఎయిర్బస్ ఏ 380, బోయింగ్ 777–9 వంటి ప్రపంచంలోని అతిపెద్ద విమానాలు కూడా అమరావతిలో ల్యాండింగ్ చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ విమానాశ్రయం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన రవాణాలో కీలక కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.త్వరలోనే భూసేకరణ, టెండర్లు, నిర్మాణ పనులపై ప్రభుత్వ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News