admin

సెల్ ఫోన్ అవసరానికి మించి వినియోగించడం వలన అనర్ధాలే ఎక్కువ

హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు సెల్ ఫోన్ వినియోగించటం నిబంధనకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి మనిషి ఒక పూట ఆహారం లేకపోయినా ఉండగలుగుతున్నాడు కానీ సెల్ ఫోన్ మాత్రం వదిలి ఉండలేకపోతున్నాడు .సెల్ ఫోన్ ఎక్కువ శాతం వినియోగించడం వలన చిన్న పిల్లలకు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. వైరస్ తో కూడిన జబ్బులు జ్వరాలు నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. సెల్ ఫోన్ ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గే …

Read More »

సచిన్ టెండూల్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి లోకేష్

పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: భగవాన్ సత్య సాయిబాబా సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచిన్ ను కలిసిన వారిలో మంత్రి లోకేష్ తో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా

ఇల్లందు,ఐఏషియ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తన రేషన్ షాపులో స్టాక్ లేనందుకు,పనివేళ్లలో రేషన్ షాపు మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గానూ రేషన్ షాపు యజమాని వద్ద 30 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా.డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా, సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ ను సోమవారం లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నిందితులను అదుపులోనికి తీసుకొని …

Read More »

రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే రెండోసారి అలాగే దేశంలోనే తొలిసారిగా కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం గుట్ట – నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపుర్ సమీపంలోని సోమశిల వరకూ ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ కేబుల్ వంతెన ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక పనులు ప్రారంభం కావడమే …

Read More »

మత్స్యకార విద్యార్థినికి రూ.10వేలు ఆర్థిక సాయం

విద్యార్థులనూ ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: మత్స్యకార వర్గానికి చెందిన గుర్రాల జాబిలి బిఫార్మసీ థర్డ్ ఇయర్ ఫీజు కోసం పేదల పెన్నిధి, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10వేలు చేయూత అందించి దాతృత్వం చాటుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లు రాక కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థినికి వాసుపల్లి సొంత నిధులతో పదివేలు నగదును సోమవారం ఆశీలమెట్ట వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ …

Read More »

మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో ఫేక్ టీటీడీ దర్శన లెటర్లు

విజయవాడ,ఐఏషియ న్యూస్:  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకీలీ టీటీడీ దర్శన లెటర్లు జారీ అవ్వటం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి పీఏ సోమవారం విజయవాడ నగర కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిటిడి కి జారీ చేస్తున్న ఇటువంటి నకిలీ లెటర్లు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. Authored by: Vaddadi …

Read More »

సౌదీ అరేబియాలో బస్సు దగ్ధం: 42 మంది దుర్మరణం

ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు నష్టపరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం సౌదీ అరేబియా,ఐఏషియ ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో ఒకే ఒక్క వ్యక్తి బయటపడ్డాడు. ఆ వ్యక్తి పేరు మహ్మద్ అబ్దుల్ షోయబ్(24) కాగా.. ఇతను …

Read More »

టెక్స్ టైల్స్ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు కుదిరిన 7 ఎంవోయూలు 6,100 ఉద్యోగాల రాక విశాఖపట్నం, చిత్తూరు,గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి పరిశ్రమల ఏర్పాటు రూ.4 వేల కోట్లతో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ పెట్టుడులు పెట్టుబడులతో టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు …

Read More »

తుక్కు దుకాణంలో వ్యర్థ రసాయనాలు అగ్నికి ఆహుతి

పరవాడ,ఐఏషియ న్యూస్: తుక్కు దుకాణంలో ఫార్మా వ్యర్ద రసాయనాలు భగ్గు మన్నాయి. పరవాడ ఫార్మాసిటీ పరిసరాలలో తుక్కు దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పడ్డాయి. అటు అనకాపల్లి పిసిబి అధికారులు, ఇటు పరవాడ పోలీస్ అధికారుల సహకారంతో ఫార్మా వ్యర్థ రసాయనాలు కంటైనర్ లను తుక్కు దుకాణాల ముసుగులో నిల్వ ఉంచుతున్నారు. వ్యర్థ రసాయనాలు భూమిలోకి ఇంకి కొంతమేర వ్యాపించడంతో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. తుక్కు దుకాణాల సమీపంలో నిప్పు పుడితే పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పరవాడ మండల పరిధిలో ఎంఎస్ ఎంఈ పార్కులో గతంలో …

Read More »

సింహాచలం దేవస్థానంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

సింహాచలం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం,సింహాచలంలో విస్తృత స్థాయిలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.భక్తులకు అత్యంత పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.సుజాత ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం శ్రద్ధగా అమలు చేయబడింది. డిప్యూటీ ఈ.ఓ. సింగం రాధ, సహాయ కార్యనిర్వహణాధికారులు కె.తిరుమలేశ్వరావు, వాడ్రేవు రమణమూర్తి కార్యక్రమాన్ని …

Read More »