admin

ఘనంగా భగవాన్ సత్యసాయి శ‌త‌జయంతోత్సవాలు

జయంతోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సత్య సాయి బాబా స్మారక వంద రూపాయల జ్ఞానం పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి వేదికగా స‌త్య‌సాయి శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ మేరకు ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సాయి …

Read More »

బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్

అమరావతి,ఐఏషియ న్యూస్:  బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ గురువారం హాజరు కానున్నారు.బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇరువురు నేతలకు ఆహ్వానం అందింది.విజయవాడ నుంచి గురువారం ఉదయం 8 గంటలకు పాట్నాకు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉదయం 10.20 నిముషాలకు పాట్నాలోని గాంధీ మైదాన్ లో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ఇరువురు …

Read More »

ఏలూరులో పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

ఏలూరు,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు.అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఏలూరు మినీ బైపాస్ రోడ్డు సమీపంలో, పెద్దగా జన సంచారం లేని అపార్ట్మెంట్ల సముదాయాల చివరలో ఆ ప్రాంతానికి చెందిన …

Read More »

లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ మండల సర్వేయర్

సికింద్రాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న కిరణ్ మంగళవారం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కాలువ కిరణ్ కుమార్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకుఆయన రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్ మాన్ ద్వారా లక్ష రూపాయలు లంచం …

Read More »

డిసెంబర్ 30 నుంచి పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం

సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్న టీటీడీ టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. పాలక మండలి సభ్యుడు, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై ముఖ్యంగా చర్చించారు.డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఉత్తర ద్వార దర్శనంలో …

Read More »

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభం

ఏపీ చీఫ్ బ్యూరో,చాన్విక జ్యోతిన్యూస్: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా, వేలాది మంది భక్తులు “సాయి నామస్మరణ” చేశారు. మంగళవారం ఉదయం వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టం వెండి రథోత్సవం. ఈ రథం 31.8 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపై 9.2 కిలోల బంగారంతో చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. రథం తయారీకి 180 కిలోల వెండిని, బంగారు పూత …

Read More »

సెల్ ఫోన్ అవసరానికి మించి వినియోగించడం వలన అనర్ధాలే ఎక్కువ

హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు సెల్ ఫోన్ వినియోగించటం నిబంధనకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి మనిషి ఒక పూట ఆహారం లేకపోయినా ఉండగలుగుతున్నాడు కానీ సెల్ ఫోన్ మాత్రం వదిలి ఉండలేకపోతున్నాడు .సెల్ ఫోన్ ఎక్కువ శాతం వినియోగించడం వలన చిన్న పిల్లలకు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. వైరస్ తో కూడిన జబ్బులు జ్వరాలు నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. సెల్ ఫోన్ ప్రభావంతో జ్ఞాపకశక్తి తగ్గే …

Read More »

సచిన్ టెండూల్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి లోకేష్

పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: భగవాన్ సత్య సాయిబాబా సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సచిన్ ను కలిసిన వారిలో మంత్రి లోకేష్ తో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా

ఇల్లందు,ఐఏషియ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తన రేషన్ షాపులో స్టాక్ లేనందుకు,పనివేళ్లలో రేషన్ షాపు మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గానూ రేషన్ షాపు యజమాని వద్ద 30 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా.డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా, సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ ను సోమవారం లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నిందితులను అదుపులోనికి తీసుకొని …

Read More »

రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే రెండోసారి అలాగే దేశంలోనే తొలిసారిగా కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం గుట్ట – నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపుర్ సమీపంలోని సోమశిల వరకూ ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ కేబుల్ వంతెన ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక పనులు ప్రారంభం కావడమే …

Read More »