కుప్పం,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉందని సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫ్యామిలీకి ఇంకా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భువనేశ్వరి …
Read More »admin
20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్పీడీసీఎల్ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి
వనపర్తి,ఐఏషియ న్యూస్: వనపర్తి సర్కిల్ అండ్ డివిజన్లోని గోపాల్పేట్ సెక్షన్లోని టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి, ఫిర్యాదుదారుడి బంధువు వ్యవసాయ పొలాలలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి చెల్లింపులో భాగంగా ఫిర్యాదుదారుడి నుండి రూ.40 వేలు లంచం డిమాండ్ చేసి రూ.20వేలు బుధవారం లంచం తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎసిబి కోర్టుకు తరలించారు.ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు అవినీతి నిరోధక బ్యూరో …
Read More »21న భారత్ లో పర్యటించనున్న ట్రంప్ కుమారుడు
ఉదయపూర్,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈనెల 21, 22 తేదీల్లో ఉదయ్ పూర్ లో జరగనున్న ఓ రాయల్ వెడ్డింగుకు హాజరు కానున్నారు. ఈ పర్యటన ద్వారా వ్యాపార సంబంధాలు, రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీలు,రాజకీయ సందేశం వంటి అంశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అతని రాకతో ఉదయ్ పూర్ లో కఠిన భద్రత ఏర్పాట్లు చేశారు.ఈ సందర్శన భారత్ కు గ్లోబల్ వ్యాపార,టూరిజం అవకాశాలు, మీడియా దృష్టిని తీసుకువచ్చిన సాఫ్ట్ పవర్ మూమెంట్ గా భావిస్తున్నారు. Authored by: Vaddadi …
Read More »తెలంగాణ రాష్ట్ర పంచాయితీ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయితీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ, షెడ్యూల్ ప్రకటించింది.గురువారం నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల తప్పుల సవరణ 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం 23న తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు …
Read More »ఘనంగా భగవాన్ సత్యసాయి శతజయంతోత్సవాలు
జయంతోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సత్య సాయి బాబా స్మారక వంద రూపాయల జ్ఞానం పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి వేదికగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ మేరకు ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సాయి …
Read More »బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్
అమరావతి,ఐఏషియ న్యూస్: బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ గురువారం హాజరు కానున్నారు.బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇరువురు నేతలకు ఆహ్వానం అందింది.విజయవాడ నుంచి గురువారం ఉదయం 8 గంటలకు పాట్నాకు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉదయం 10.20 నిముషాలకు పాట్నాలోని గాంధీ మైదాన్ లో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ఇరువురు …
Read More »ఏలూరులో పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు
ఏలూరు,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు.అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఏలూరు మినీ బైపాస్ రోడ్డు సమీపంలో, పెద్దగా జన సంచారం లేని అపార్ట్మెంట్ల సముదాయాల చివరలో ఆ ప్రాంతానికి చెందిన …
Read More »లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ మండల సర్వేయర్
సికింద్రాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న కిరణ్ మంగళవారం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కాలువ కిరణ్ కుమార్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకుఆయన రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్ మాన్ ద్వారా లక్ష రూపాయలు లంచం …
Read More »డిసెంబర్ 30 నుంచి పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం
సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్న టీటీడీ టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. పాలక మండలి సభ్యుడు, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై ముఖ్యంగా చర్చించారు.డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఉత్తర ద్వార దర్శనంలో …
Read More »పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభం
ఏపీ చీఫ్ బ్యూరో,చాన్విక జ్యోతిన్యూస్: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా, వేలాది మంది భక్తులు “సాయి నామస్మరణ” చేశారు. మంగళవారం ఉదయం వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్య ఘట్టం వెండి రథోత్సవం. ఈ రథం 31.8 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిపై 9.2 కిలోల బంగారంతో చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. రథం తయారీకి 180 కిలోల వెండిని, బంగారు పూత …
Read More »
News Website (iasianews.net) I Asia News