admin

బ్రాహ్మణ వ్యవస్థను కించపరిచిన వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు

అనకాపల్లి,ఐఏషియ న్యూస్: బ్రాహ్మణులను, బ్రాహ్మణ వ్యవస్థను కించపరుస్తూ, అవమానకరంగా పాటలు రూపంలో, యూట్యూబ్ ద్వారా బ్రాహ్మణ వస్త్రధారణ వ్యవస్థని కించపరిచిన రమణ అనే గాయకుడు మీద అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ఆధ్వర్యంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్, నూకాంబిక అమ్మవారి ఆలయ ధర్మకర్త కొడుకుల శ్రీకాంత్, బిజెపి నాయకులు ఓరుగంటి నాగమణితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘ …

Read More »

గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు

అమరావతి,ఐఏషియ న్యూస్: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నెలకొన్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేయడం జరిగింది.2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ చేయాలని నిర్ణయించారు.ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం.ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అలాగే గోదారి పుష్కరాలు నిర్వహణ కోసం మంత్రుల కమిటీని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి …

Read More »

నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాం గం పౌరులు పాలకులు, పాలన యంత్రాంగం, పాటించవలసిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు వాటి స్వరూపం స్వభావం లక్ష్యాలు ఆశయాలు వివరించారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు సర్వతో ముఖాభి వృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది.భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ …

Read More »

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా

జయశంకర్ భూపాలపల్లి,ఐఏషియ న్యూస్: జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వెంటనే అప్పగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.చాలా కాలంగా జర్నలిస్టు సోదరులు వేచి చూస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాని తీవ్రంగా టిడిపి ఖండించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు,వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి సాగర్, పెద్దపల్లి టిడిపి ఇంచార్జ్ అందే భాస్కరాచారి దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులకు మద్దతు …

Read More »

మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ 30 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు అందజేత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాల ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ద్వారకా తిరుమల, కొయ్యలగూడెం మండలాల్లో పర్యటించారు. రాజమండ్రి మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం చేరుకుని …

Read More »

15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన అసిస్టెంట్ లేబర్ అధికారి చందర్

ఖమ్మం,ఐఏషియ న్యూస్: ఖమ్మం జిల్లా సహాయ కార్మిక అధికారి కర్నె చందర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధిరకు చెందిన భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేసుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి అతడి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు, ఇతర ఖర్చుల కోసం రూ.1.30 లక్షలు వస్తాయి. ఆ డబ్బుల కోసం మృతుడి కుమారుడు దరఖాస్తు చేసుకున్నాడు.ఈ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపి, రూ.1.30 లక్షలు మంజూరు చేయడానికి జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి చందర్ రూ.15 …

Read More »

హైదరాబాద్ కోకాపేటలో ఎకరం 137 కోట్ల 25 లక్షలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ.137 కోట్ల 25 లక్షలు పలికింది. నియోపోలిస్‌ లో ఉన్న ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు,ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు హెచ్ ఎండీఏ అధికారులు వేలం నిర్వహించారు. అయితే సర్వే నెంబర్ 17లోని ఎకరం భూమి ధర రూ.137.25 కోట్లు పలికింది. హెచ్‌ ఎండీఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్‌ లైన్‌ వేదికగా వేలం వేయడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటీవల నోటిఫికేషన్‌ …

Read More »

హిందీ సినిమా దిగ్గజం ధర్మేంద్ర కన్నుమూత

ముంబయి,ఐఏషియ న్యూస్: మ్యాన్ ఆఫ్ హిందీ సినిమాగా ప్రసిద్ధి పొందిన హీరో ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ‘‘ధర్మేంద్ర అస్తమయంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టా‌గ్రామ్‌లో నివాళులర్పించారు. కొన్నిరోజుల కిందట ధర్మేంద్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబయిలోని బీచ్‌కాండీ ఆస్పత్రిలో చేారారు. అయితే చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే పరిస్థితి విషమం కావడంతో చికిత్స పొందుతూ ధర్మేంద్ర మృతి చెందారు.నిజ జీవితానికి వస్తే రచయిత, ప్రేమికుడు, తండ్రి, ప్రపంచంలోని అందగాళ్లలో ఒకరు, తాగుడు అలవాటును అధిగమించిన …

Read More »

Indian Blind Women’s Cricket Team winning the First Ever T20 World Cup Beating Nepal in the Final

The Indian Women’s Blind Cricket Team carved their names into history by clinching the title in the inaugural Women’s T20 World Cup for the Blind in a spectacular, unbeaten campaign. This monumental victory, secured against Nepal in the final in Colombo, Sri Lanka, marked a watershed moment for visually impaired athletes globally and a testament to the team’s relentless spirit …

Read More »

11 కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లు నియామకం

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 11కార్పోరేషన్ లకు ఛైర్మెన్ లను ప్రభుత్వం నియామకం చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా కల్యాణం శివ శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా సత్యనారాయణరాజు, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్‌ గా విక్రమ్, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా మౌలానా షిబిలీ, ఫిషర్‌ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌ …

Read More »