admin

భాగస్వామ్య సదస్సు సక్సెస్ పై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులకు అభినందనలు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: భాగస్వామ్య సదస్సు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీసీసీ ఎండీ కల్పనా కుమారిలను అభినందిస్తూ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడువీరికి జ్ఞాపికలు అందజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏపీకి 13 లక్షల కోట్లు పెట్టుబడులు: సీఎం చంద్రబాబు ప్రకటన

ముగిసిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారంతో దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీలో ఏర్పాటు చేసిన మరికొన్ని యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు.శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 12,365 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి …

Read More »

సత్యదేవ నిత్యాన్నదాన ట్రస్టుకు లక్ష విరాళం

అన్నవరం,ఐఏషియ న్యూస్: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి చెందిన శ్రీ సత్యదేవ నిత్య అన్నదాన ట్రస్ట్ కు శనివారం భక్తులు అల్లూరి సూర్యనారాయణ రాజు, శ్రీమతి సూర్యచంద్ర కాంతం పేరుమీదుగా 1,00,000 రూపాయలు విరాళముగా అందజేశారు.ఈ విరాళమును ప్రతీసంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహణ కోసం భక్తి శ్రద్ధలతో సమర్పించారని దేవస్థాన అధికారులు తెలిపారు.భక్తుల సేవా భావం, సమర్పణ భావనకు దేవస్థానం కృతజ్ఞతలు తెలియజేసింది.శ్రీ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ భక్తులందరిపై ఉండాలని …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆత్మీయ వీడ్కోలు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ జిల్లాలో సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్-2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ తో కలిసి,ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాకు తిరుగు పయనమయ్యారు.ఈ సందర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులు, జిల్లా అధికారులు శనివారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రికి విశాఖ ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్,ప్ర‌భుత్వ విప్ గ‌ణ‌బాబు, శాసనసభ్యులు పల్లా …

Read More »

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు ఘన స్వాగతం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ పరిశీలనకు విచ్చేసిన కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్రకి,అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, బిజెపి పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గొర్లె రాము నాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, జనసేన, టీడీపీ, బిజెపి నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి నాయకులు హాజరైనారు. …

Read More »

విజయవాడ-బెంగళూరుకు వందే భారత్

తిరుపతి ప్రయాణికులకు శుభవార్త విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న ఇండియన్ రైల్వే ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఇచ్చి వరం ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త రైలును మంజూరు చేసింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏపీకి కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్వే శాఖ ఇటీవల ఏపీకి ఇచ్చిన కొత్త వందే …

Read More »

లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.విశాఖ సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం అనే అంశంపై చర్చా గోష్టిలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం సాయంత్రం పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట్రాన్ని అభివృద్ధి …

Read More »

బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలు 25 యేళ్ల మైథిలీ ఠాకూర్‌

పాట్నా,ఐఏషియ న్యూస్: ఆధ్యాత్మిక, జానపద గీతాలను ఆలపిస్తూ మైథిలీ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించారు. బీహార్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. మైథిలీ ఠాకూర్‌ అలీనగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆమె ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్‌ మిశ్రాను 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.ఇక ఫేస్‌బుక్‌లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైథిలీ …

Read More »

ఏపీకి భారీగా పెట్టుబడులు: 3,49,476కోట్ల ఒప్పందాలు

4,15,890 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్ర శనివారాలు రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తొలిరోజైన శుక్రవారం …

Read More »

డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వ రెండవ వార్షికోత్సవం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8 వ తేదీన రెండవ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని వచ్చే డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ …

Read More »