సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సీఐఐ సదస్సులో భాగంగా విశాఖ నోవాటెల్ హోటల్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న 3 సంస్థలు ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో మారిటైమ్ రంగంలో దాదాపు 1,300 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం లభిస్తుంది.అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సులో పాల్గొనడం జరిగింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ …
Read More »admin
జాజులుబంధలో కొత్తగా స్కూల్ ప్రారంభం
థింసా నృత్యం చేసి పండగ చేసుకున్న ఆదివాసీలు డీఈవో, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం కొయ్యూరు,ఐఏషియ న్యూస్: తమ గ్రామంలో కొత్తగా పాఠశాల ప్రారంభం కావడంతో గ్రామస్తులంతా థింసా నృత్యాలతో హోరెత్తించారు. చిన్నారులు చిందులేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులుబంధ గ్రామంలో 30 కొందు గిరిజన ఆదివాసీ కుటుంబాలున్నాయి. ఇక్కడ పాఠశాల భవనం లేకపోవడంతో 2023-24లో గ్రామస్తులే స్వయంగా షెడ్డు నిర్మించారు. మాతృభూమి అనే స్వచ్ఛంద సంస్థ రూ.1.35లక్షలతో విద్యా సామగ్రిని సమకూర్చింది. ఆ సంస్థ నిర్వాహకులు పుస్తకాలు …
Read More »జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: జూబ్లీహిల్స్ ఉపఎన్ని కౌంటింగ్ శుక్రవారం జరగనున్నది. కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బంది నియామకం చేశారు.ప్రత్యేక అనుమతితో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు.10 రౌండ్లలో పూర్తికానున్న కౌంటింగ్ ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేశారు.ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం నేడు కూడా 144 సెక్షన్ అమలులో ఉంది.ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలువిజయోత్సవ …
Read More »ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు నేనే చెల్లిస్తా
కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ టెన్త్ విద్యార్థులకు శుభవార్త హైదరాబాద్,ఐఏషియ న్యూస్: కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. విద్యార్థులపై తమకున్న అభిమానాన్ని బహిర్గతం చేశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోగల ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ చెల్లించవలసిన పరీక్ష ఫీజును ఎస్ఎస్సీ బోర్డుకు తానే స్వయంగా కడతానని గురువారం ప్రకటించారు.ఈ మొత్తాన్ని తనకు వచ్చే ఎంపీ వేతనం …
Read More »నేడు జవహర్లాల్ నెహ్రూ జయంతి
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: నవభారత నిర్మాతగా, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అంతులేని కీర్తిని సంపాదించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14. ఈ రోజున దేశంలోని చిన్నారులందరూ “బాలల దినోత్సవం”గా కన్నులపండువగా జరుపుకుంటారు. చాచాజీ జన్మదినం రోజునే బాలల పండుగను జరపటానికి కారణం. పిల్లలపట్ల ఆయనకు ఉన్న ప్రేమే.అందుకే “జాతి భవిష్యత్తు నాలుగ్గోడల మధ్యనే రూపుదిద్దుకుంటుంది కాబట్టి దేశంలోని బాలబాలికల అభివృద్ధికై తన పుట్టిన రోజును బాలల దినోత్సవం”గా జరుపుకోవాలని చాచాజీ ఆకాంక్షించారు.కాబట్టి చాచాజీ ఆశించినట్లుగా మన దేశంలో ప్రతి …
Read More »నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్ ఎన్నికలు ఫలితాలు శుక్రవారం ప్రకటించనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారంఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం9 గంటల నుంచి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు4,372 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుఉదయం 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం.243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో జరిగిన పోలింగ్1951 తర్వాత బిహార్లో అత్యధికంగా పోలింగ్ నమోదుఈసారి అత్యధికంగా 67.13శాతం పోలింగ్ నమోదుబిహార్లో …
Read More »భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే
జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలుకు చెందిన సందీప్ 2014 ఐపీఎస్ అధికారి. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, సీసీ కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సందీప్ ను అభినందించారు. Authored …
Read More »మున్సిపాలిటీలలో బిల్డింగ్ క్రమబద్ధీకరణ బిపిఎస్ స్కీమ్ జీవో విడుదల
అమరావతి,ఐఏషియ న్యూస్: అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్ / ప్లాన్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ – ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం (బిపిఎస్–2025) రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు బిల్డింగ్ క్రమబద్ధీకరణకు బుధవారం జీవో జారీ చేసింది. ఎవరు అప్లై చేయొచ్చు? 01-01-1985 నుండి 31-08-2025 మధ్య కట్టిన బిల్డింగ్స్,మున్సిపాలిటీ, కార్పొరేషన్, యు డి ఎ , సి ఆర్ డి ఏ, వి ఏం ఆర్ డి ఏ, ఐలా పరిధిలో ఉన్నవారు ఈ స్కీం లో కింద అప్లై …
Read More »నేడు విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు శంకుస్థాపన
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎండాడలో పనోరమ హిల్స్ వెనుక 10ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. Authored by: Vaddadi udayakumar
Read More »సినీనటుడు జోష్ రవికి పితృవియోగం
మార్టేరు (పశ్చిమగోదావరి జిల్లా),ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటుడు జోష్ రవికు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో మూడో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు వెంటనే ఇంటికి వెళ్లే లోపు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే మార్టేరు గ్రామం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది.గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యానికి నాని పంతులు అర్చక సేవలు …
Read More »
News Website (iasianews.net) I Asia News