admin

భారత్ కు గేట్ వే లా మారనున్న ఆంధ్రప్రదేశ్

విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం 72 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు విశాఖపట్నం ,ఐఏషియ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలానే కేంద్రమంత్రులు …

Read More »

టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు కోటి విరాళం

తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విజయవాడకు చెందిన భక్తుడు చక్కా మోనిష్ వెంకట సత్యప్రకాష్ తరపున ప్రతినిధి భూషణ్ శుక్రవారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడును కలసి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. విరాళం అందజేసిన సత్య ప్రకాష్ కు టీటీడీ తరఫున చైర్మన్ బి ఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఎముక కాన్సర్‌ బాధితుడు పూర్వ విద్యార్థి యోగికి సహాయహస్తం

విరాళాలు సేకరించిన శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థి యోగి కుటుంబ సభ్యులకు లక్ష ఐదు వేల రూపాయలు అందజేత గాజువాక,ఐఏషియ న్యూస్: గాజువాక శ్రీ రాఘవేంద్ర స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి యోగి ప్రస్తుతం ఎముక కాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడు.యోగి చికిత్సకు మొత్తం 25 లక్షలు రూపాయలు అవసరమైన పరిస్థితిలో, ప్రభుత్వం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసింది. మిగతా వైద్య ఖర్చుల కోసం పాఠశాల యాజమాన్యం ముందుకువచ్చి సహాయం అందిస్తోంది. యోగి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న …

Read More »

ఉపరాష్ట్రపతికి ఘన ఆత్మీయ వీడ్కోలు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ జిల్లాలో సిఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం నగరానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు.సిఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొన్న మధ్యాహ్నం 12-30 గంటలకు తిరుగు పయనంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు.ఉప రాష్ట్రపతికి ఎయిర్ పోర్టులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్, శాసనసభ్యులు విష్ణు కుమార్ …

Read More »

విశాఖ నుండి శబరిమలై భక్తులు కొరకు స్పెషల్ ప్యాకేజీ బస్సులు

19 నుంచి 23 వరకు పుట్టపర్తి కూడా ప్రత్యేక బస్సులు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నుండి శబరిమలై భక్తులు కొరకు స్పెషల్ ప్యాకేజీ బస్సులు నడుపుతున్నట్లు విశాఖ ఆర్టీసీ ఆర్ఎం బి అప్పలనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.అదేవిధంగాపంచరామాలకి మంచి స్పందన ఉన్నందున ఈనెల 22, 23 తేదీలలో కూడా పంచారామాలకు బస్సులు స్పెషల్ నడుపుతున్నట్లు ఆర్.ఎం పేర్కొన్నారు.అదేవిధంగా శ్రీ సత్య సాయిబాబా జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 19వ తారీకు నుండి 23వ తారీకు వరకు 100 సంవత్సరాల పుట్టినరోజు ఉత్సవాలు జరుపుతున్నారని …

Read More »

జూబ్లీహిల్స్ ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం

24,729 ఓట్ల మెజార్టీ సాధించిన నవీన్ యాదవ్  హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఉప ఎన్నికలో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో డిపాటిజ్ కోల్పోయారు.ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.ఎమ్మెల్యేగా ఎన్నికైన …

Read More »

Padmashri Award Recipient Salumarada Thimmakka is no more.

Salumrada Thimmakka, a remarkable environmental activist from the village of Salumrada in Karnataka, India, is best known for her extraordinary efforts in tree planting and environmental conservation. Born in 1911, Thimmakka faced significant challenges in her life, including poverty and the inability to have children, but she channeled her energies into a cause that would have a lasting impact on …

Read More »

సిఆర్పిఎఫ్ ఐజి ని కలిసిన విశాఖ రేంజ్ డీఐజీ

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి 234 బటాలియన్ సి ఆర్ పి ఎఫ్, విశాఖపట్నం, బక్కన్న పాలెం వద్ద సి అర్ పి ఎఫ్ ఐ జి విపుల్ కుమార్ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇద్దరు ఉన్నతాధికారులు ఎల్ డబ్ల్యు ఈ పరిస్థితులు, భద్రతా చర్యలు, సంయుక్త ఆపరేషన్ల సమన్వయం, సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.సభ్యసమాజ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీస్, సిఆర్పిఎఫ్ పరస్పర సహకారం మరింత బలోపేతం చేయాలని …

Read More »

25 నుండి ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ 24 గంటలు వాలిడిటీ

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీఎస్ఆర్టీసీ సిటీ పరిధిలో, సబర్బను పరిధి వరకు ఒకరోజు టికెట్టు ట్రావెల్ అస్ యు లైక్. 25 నుండి 24 గంటలు వాలిడిటీ ఉండేలాగా అనుమతించబడునని రీజనల్ మేనేజర్ విశాఖపట్నం బి.అప్పల నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ విషయము ప్రయాణికులందరూ గమనించి ఏ టైం లో తీసుకున్నారు తరువాత రోజు ఆ టైం వరకు అంటే 24 గంటలు వరకు అనుమతి ఉందని తెలియజేసి ఉన్నారు. విషయాన్ని గమనించవలసిందిగా ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. Authored by: Vaddadi udayakumar

Read More »

జర్రిల పాఠశాలలో30 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

సకాలంలో స్పందించి విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులు గూడెం కొత్తవీధి,ఐఏషియ న్యూస్: గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు సకాలంలో స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థులను జర్రెల పీహెచ్సీకి తరలించి చికిత్స అందజేశారు.ఈ పాఠశాలలో సుమారు 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిలో సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు తెలియజేశారు. బుధవారం రాత్రి కందదుంప కూర వండటం జరిగిందని, 30 మంది విద్యార్థులు కంద దుంపలో …

Read More »