Recent Posts

ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం

అమరావతి,ఐఏషియ న్యూస్: వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యువత, ఉత్సవ కమిటీలు వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వినాయకచవితికిమాత్రమేకాదు.విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చి్ంచిన తర్వాత ఈ నిర్ణయం …

Read More »

అమెరికా పెంచిన టారిఫ్ పై భారత్ లో హైలెవెల్ సమావేశం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:  భారత్ పై అమెరికా సుంకాల పెంపుదల చేసిన క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఈ నెల మొదట్లోనే 25 శాతం సుంకాలు భారత్‌పై విధిస్తున్నట్లు ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్న ట్రంప్ భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం హైలెవల్ …

Read More »

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్ డ్రైవ్,వాట్సాప్ సర్వీసులు నిషేధం

శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్:  అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్‌లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌లోని కీలక శాఖలు, వెబ్‌సైట్‌లపై భారీఎత్తున సైబర్ దాడులు జరగ్గా వాటిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లలో పెన్‌డ్రైవ్‌లు వాడడాన్ని నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఉపయోగించేవాట్సాప్ …

Read More »