Recent Posts

పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పాకిస్తాన్ తో సంబంధాలకు సంబంధించి విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల 10 నెలల జైలు శిక్షను,ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.దీనితో ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించినట్లు ఎన్‌ఐఏ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

అనంత్ నాగ్ లో పక్షి ఢీకొనడంతో లోకో పైలట్ కు గాయాలు: ప్రయాణికులందరూ సురక్షితం

అనంత్ నాగ్,ఐఏషియ న్యూస్: బిజ్బెహారా-అనంత్ నాగ్ మధ్య శనివారం ఉదయం లోకోమోటివ్ అద్దంను డేగ ఢీకొనడంతో రైలు పైలట్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.గాయపడిన పైలట్ శ్రీ విశాల్ కు అనంత్ నాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.తనిఖీ కోసం రైలును కొద్దిసేపు నిలిపివేసి, తర్వాత రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

            హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,పీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు,ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని,ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు …

Read More »