Recent Posts

పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి సారూ..

అరకులోయ,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని బి.బొడ్డపుట్టు పంచాయతీ పరిధి దబ్బాగరువు గ్రామానికి చెందిన విద్యార్థిని పాంగి దేవి తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటుంది.బి.బొడ్డపుట్టు ఎంపీపీ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నానని పుట్టుకతో దివ్యాంగురాలు.రెండు కాళ్లు రాక వీల్ చైర్లో తన సోదరుడు రోజు కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు తీసుకువేళ్తారని చెప్పింది.పింఛన్ కోసం తమ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగిన పింఛన్ నేటికీ మంజూరు కాలేదని,ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేసి తనను ఆదుకోవాలని …

Read More »

ఆసీస్‌ను చిత్తుచేసిన భారత్‌

క్వీన్‌లాండ్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 119 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (30)టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సుందర్‌ 3, అక్షర్‌ 2, శివమ్‌ 2 వికెట్లు తీశారు.అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది.తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం …

Read More »

అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

తిరుమల,ఐఏషియ న్యూస్: అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది.ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఎఫ్ ఐ పి ఓ (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. Authored by: Vaddadi udayakumar

Read More »