Recent Posts

బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలు 25 యేళ్ల మైథిలీ ఠాకూర్‌

పాట్నా,ఐఏషియ న్యూస్: ఆధ్యాత్మిక, జానపద గీతాలను ఆలపిస్తూ మైథిలీ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించారు. బీహార్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. మైథిలీ ఠాకూర్‌ అలీనగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆమె ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్‌ మిశ్రాను 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.ఇక ఫేస్‌బుక్‌లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైథిలీ …

Read More »

ఏపీకి భారీగా పెట్టుబడులు: 3,49,476కోట్ల ఒప్పందాలు

4,15,890 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్ర శనివారాలు రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తొలిరోజైన శుక్రవారం …

Read More »

డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వ రెండవ వార్షికోత్సవం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8 వ తేదీన రెండవ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని వచ్చే డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ …

Read More »