Recent Posts

3.80 కోట్ల విలువైన 763 కేజీల గంజాయి పట్టివేత

చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మీడియా సమావేశంలో వెల్లడి చింతపల్లి,ఐఏషియ న్యూస్: చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని వర్తనపల్లిలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకోవటం జరిగిందని ఏఎస్పీ నవ జ్యోతి మిశ్రా తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు జరిపిన దాడిలో 25 బస్తాలలో నిల్వ ఉంచిన 763 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 3 కోట్లు 80 లక్షలు 88 వేలుగా పోలీసులుఅంచనా వేశారు.సీఐ వినోద్ బాబు నేతృత్వంలోని ఎస్ ఐ …

Read More »

గోవాలో 77 అడుగుల శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

గోవా,ఐఏషియ న్యూస్: గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని శుక్రవారం పీఎం మోదీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు.550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఈనెల 27 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. Authored by: Vaddadi udayakumar

Read More »

కనకమహాలక్ష్మిని దర్శించుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో శోభారాణి ప్రిన్సిపల్ కార్యదర్శి సూర్యకుమారికి శేష వస్త్రాలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »